Sunday, August 24, 2014

మన చర్మం మొద్దుబారిందా?

ఢిల్లీలో బస్సులో ఓ యువతిపై సామూహిక పైశాచిక అత్యాచారం దేశాన్ని కదిలించింది.. వారాల తరబడి మీడియా లైవ్ వార్తలు ఇచ్చింది.. యువజనం రోడ్ల మీదకు వచ్చారు.. ప్రభుత్వం వణికిపోయింది..
ముంబైలోని ఓ శిథిల మిట్లులో ఓ మహిళా జర్నలిస్టులపై దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు.. రోజుల తరబడి మీడియాలో చర్చలు జరిగాయి..
బెంగళూరు ఏకంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు నిలయంగా మారిపోయింది.. అక్కడి ప్రజలు, మీడియా గగ్గోలు పెట్టేసింది..
హైదరాబాద్ లో దయ్యానీ స్నేక్ బ్యాచ్ అత్యాచార పర్వం వెలుగులోకి వచ్చింది.. విజయవాడలో కొందరు యువకులు అమ్మాయిలను బెదిరించి అశ్లీల దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు.. ఈ రెండు ఘటనల్లో నిందితులు పట్టుబడ్డారు.. కానీ ఎక్కడా చర్చలేదు.. మీడియా మమ అంటూ వార్తలు ఇచ్చేసి మూగనోముపట్టింది..

మన తెలుగు సమాజం చర్మం అంతగా మొద్దు బారిందా?.. ఎక్కడ ఉంది లోపం? 

No comments:

Post a Comment