Wednesday, August 6, 2014

మోదీ రక్ష..

రక్షాబంధన్ స్పెషల్.. ఉత్తర భారత దేశంలో ఈ కొత్త రాఖీలు గరం మిర్చీల్లా అమ్ముడు పోతున్నాయి.. అవే మోదీ రాఖీలు.. అక్కయ్యలూ, చెల్లెమ్మలూ ఈ రాఖీలను కొనేందుకు ఎగబడుతున్నారట.. నాలుగైదు వెరైటీల్లో తయారు చేసిన మోదీ బొమ్మ రాఖీలను 40 నుండి 50 రూపాలయ వరకూ అమ్ముతున్నారు.. స్టాక్ అయిపోతే మళ్లీ తెప్పించాల్సి వచ్చిందని ఢిల్లీకి చెందిన సీజనల్ వ్యాపారి చెబుతున్నాడు.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశానికి ఎలా రక్షకుడో.. తమ సోదరులకూ అగే రక్ష అంటున్నారు అహ్మదాబాద్ నగరానికి చెందిన ఓ యువతి.. మన హైదరాబాద్లో ఈ రాఖీలు దొరుకుతున్నాయో లేదో తెలియదు.. కానీ బేగం బజార్లో ట్రై చేసి చూడండి..

No comments:

Post a Comment