Wednesday, December 25, 2013

మళ్లీ రావాలి అటల్జీ పాలన..

దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దేశ భక్తుడు.. మహోన్నత జాతీయ వాది, ఉత్తమ పార్లమెంటేరియన్.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.. సమర్థ నాయకత్వంతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశారు.. సంస్కరణలతో దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేశారు.. స్వర్ణ చతుర్భుజి లాంటి పథకాలతో దేశంలో మౌళిక సదుపాయాలను మెరుగుపరిచారు.. పార్టీలకు అతీతంగా అందరికీ ఆత్మీయుడు.. ఒక కవిగా, వక్తగా అందరినీ కట్టిపడేసిన మహా వ్యక్తి.. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయిజీ 89వ జన్మదినోత్సవం నేడు.. వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అటల్జీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరాలని, వారి మార్గదర్శకత్వంలో దేశానికి మళ్లీ సుపరిపాలన అందాలని కోరుకుందాం..

No comments:

Post a Comment