వెనకటికి ఓ అయ్యవారు ‘ఉల్లి, వెల్లిపాయలు తామస గుణాన్ని కలిగిస్తాయి.. కాబట్టి ఆహారంలో అవి నిషిద్దం..‘ అని రచ్చబండ
దగ్గర గ్రామస్తులందరికీ సెలవిచ్చారు.. ఇంటికొచ్చి భోజనం చేస్తున్న ఆ అయ్యవారు ‘రుచీ పచీ లేకుండా వండావేం..’ అంటూ భార్య మీద కసురుకున్నాడు.. ‘మీరే కదండి చెప్పారు ఉల్లి, వెల్లుల్లి
వాడొద్దని.. అవి లేనిదే రుచి ఎలా వస్తుంది?’ అంటూ నిలదీసింది.. ‘ఓసి పిచ్చి మొహమా.. నేను చిప్పింది జనాలకు
అది మనకు వర్తించదు’ అంటూ
తేల్చేశారు అయ్యవారు..
దీనికి కాస్త రివర్స్..
అయినా ఇలాంటిదే మరో కథను చూద్దామా?..
ఓ బహుళజాతి
సంస్థ తమ ఉద్యోగుల సంక్షేమం కోరుకుంటూ తన అంతర్గత అంతర్జాలంలో ఓ లేఖ పెట్టింది.. ‘ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు.. అందులో కాలొరీలు, కొవ్వు, చక్కెర, ఉప్పుడు
శరీరానికి చేటు చేస్తాయి.. ఇవి ఎంత తక్కువ తింటే అం మంచిది..’ అంటూ సెలవిచ్చింది.. ఆహా ఆ సంస్థకు తమ
ఉద్యోగుల మీద ఎంత ప్రేమ.. వారి ఆరోగ్యం కోసం ఎంత చక్కని సలహాలు ఇస్తోందని
ప్రశంసించేస్తున్నారా?.. తొందర పడకుండా కాస్త ఆగండి..
ఇలాంటి చెత్త
ఆహారాన్ని తయారు చేస్తున్న సంస్ధే, తమ ఉద్యోగులు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది..
తమ రెస్టారెంట్లో తయారయ్యే అడ్డమైన తిండి జనం మాత్రం సుష్టుగా తిని ఆరోగ్యాన్ని
పోగొట్టుకోవాలి.. మనం మాత్రం మనం తయారు చేసే తిండి తినకుండా ఆరోగ్యాలు
కాపాడుకోవాలి.. వాట్ ఎన్ ఐడియా సర్జీ..
మరి ఆ సంస్థ నిజంగా
తమ ఉద్యోగుల క్షేమం కోరి అంతర్గత లేఖను రాసిందా? లేక ఉద్యోగులు అడ్డగోలుగా
తినేస్తున్నారనే దుగ్దతో వారికి కంట్రోల్ చేద్దామనుకుందా.. ఏది ఎలా ఉన్నా మనం
బాగుంటే చాలు.. జనం ఎట్టా చస్తే మనకెందుకు? వాడి పైసా మన జేబు నింపుతోందా.. అనేదే
ముఖ్యం.. భలే బహుళ నీతి కదూ?..
ఇంతకీ ఆ సంస్థ
పేరు చెప్పలేదు కదూ?.. అదే ‘ మెక్ డొనాల్డ్స్ ’.. ఈ లేఖ వివాదాస్పదం కావడంతో అంతర్జాలం మాయమైపోయింది..
No comments:
Post a Comment