Friday, December 13, 2013

మంచి పుస్తకం కొనుక్కో..

చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారో మహనీయుడు.. ఆనాటి పరిస్థితుల్లో వారలా సందేశం ఇచ్చి ఉండొచ్చు.. కానీ మంచి చొక్కాతో పాటు మంచి పుస్తకం కూడా కొనుక్కో అని ఈనాటి సమాజ పరిస్థితిని బట్టి ఆ సందేశాన్ని మార్చాలనిపించింది..
సినిమాలు వచ్చినా, టీవీలు వచ్చినా, ఇంటర్నెట్ వచ్చినా, సోషల్ మీడియా విజృంభించినా పుస్తకం ఇంకా నిలబడే ఉంది.. అందులోనే దాని సత్తా కనిపిస్తుంది.. సమాజం ఎంతో పురోగమించినా, మార్పులు వచ్చినా ప్రజల పఠనాసక్తిని తగ్గించలేవు.. అయితే అభిరుచులు మారుతూ ఉండొచ్చు..
గతంలో ఉన్నంత తీరికి ఇప్పడు జనాలకు ఉండటం లేదు.. జీవితంలో వేగం పెరిగిపోయింది.. ఇక చదివే తీరిక ఎవరికి ఉంటుంది అని చాలా మంది చెబుతుంటారు.. ఇది నిజమా? నాకైతే ఇది కచ్చితంగా అబద్దమే అనిపించింది.. హైదరాబాద్ లో ఇప్పడు జరుగుతున్న పుస్తక మేళాను  చూస్తుంటే..
డిసెంబర్ వచ్చిందంటే హైదరాబాద్ లో పుస్తక ప్రియులకు, సాహిత్య అభిమానులకు పండగే.. కాస్త అటు ఇటుగా ఏటా ఈ మాసంలో పుస్తక మేళా జరగడం ఆనవాయితీగా వస్తోంది.. గత పాతికేళ్లుగా నేను క్రమం తప్పకుండా బుక్ ఫెయిర్ సందర్శిస్తున్నాను.. అయితే ఈసారి పుస్తక మేళా కాస్త ప్రత్యేకంగా కనిపించింది.. డిసెంబర్ 7వ తేదీన ప్రారంభమై 14 వరకూ నిర్వహిస్తున్న ఈ మేళాలో అత్యధికంగా 370కి పైగా స్టాల్స్ ఈసారి కనిపించాయి.. వివిధ కేటగిరీల పుస్తకాలు, సాహితీ సదస్సులకు తోడు గతానికి భిన్నంగా అందరికీ ఉచిత ప్రవేశం కలిపించారు..

అయితే పుస్తక మేళాలో స్టాల్స్ పెట్టిన వారు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.. అదేమిటని విచారిస్తే గత ఏడాది వరకూ పుస్తక మేళాను నెక్లెస్ రోడ్డుపై నిర్వహిస్తూ వచ్చారు.. సాయంకాల వేళలో అక్కడికి వచ్చే వారందరికీ ఈ ఫెయిర్ సందర్శన సౌలభ్యంగా కనిపించేది.. ఈసారి మాత్రం ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక మేళా ఏర్పాటు చేశారు.. పైగా ఈ రూటులో బస్సులు తిరిగేది చాలా తక్కువ.. ఫలితంగా సందర్శకుల తాకిడి తక్కువగా ఉందట.. అయితే నాలాంటి పుస్తక ప్రియులు మాత్రం ఇలాంటొ మేళాలు అండమాన్లో పెట్టినా ఆఫ్రికాలో పెట్టిన వెళ్లడానికి సిద్దంగా ఉంటారంటే అతిశయోక్తి లేదు..

 

No comments:

Post a Comment