Tuesday, December 24, 2013

భారత ప్రభుత్వం ఇస్తున్నపద్మ అవార్డులు అనర్హులకు ఇవ్వడం ద్వారా ఏనాడో విలువ కోల్పోయాయి. అవి ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారో తెలియని పరిస్థితి.. వివిధ రంగాలల ద్వారా వారు చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఇవ్వాల్సిన ఈ అవార్డులు, సమాజానికి ఏ మాత్రం పనికి రాని వారికి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. వారు తమ వాణిజ్య అవసరాల కోసం అవార్డులను దుర్వినియోగం చేస్తున్నారు.. ఇలాంటి వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తే ఎలా భ్రష్టు పట్టిస్తారో చెప్పేందుకు హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పే ఉదాహరణ.. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ అగ్రనేత ఇంద్రసేనారెడ్డి గారు నిజంగా అభినందనీయులు.. హైకోర్టు ఆదేశాల మేరకు మోహన్ బాబు, బ్రహ్మానందం అమ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసి తమ హుందాతనాన్ని కాపాడుకుంటే బాగుంటుంది..

No comments:

Post a Comment