Tuesday, December 24, 2013

ఎందుకీ వివక్ష?..

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి ఒకే రోజున వచ్చాయి.. దేశంలోని అత్యున్నత పదవులు అలంకరించిన ఈ ఇద్దరూ గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా సేవలు అందించిన వారే.. మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్న పీవీ సమాధికి నివాళ్లు అర్పించడంలో వివక్ష చూపించి, అనంతపురంలో జరిగిన నీలం జయంతికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు? అది రాష్ట్రపతి ప్రణబ్ పాల్గొన్న కార్యక్రమమని సాకులు చూపడం అవసరమా.. నిజానికి హైదరాబాద్ లోనే బసచేసిన రాష్ట్రపతి, ప్రణబ్ మొదట పీవీకి నివాళులు అర్పించి, ఆ తర్వాత నీలం జయంతి కార్యక్రమానికి వెళితే ఎంత హుందాగా ఉండేది.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర వహించిన ప్రథమ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారిపై తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నా నేపథ్యంలో సమైక్యవాదాన్ని సమర్థిస్తున్న సీఎం కిరణ్ కు నరసింహారావుపై వివక్ష చూపించి తెలంగాణ వ్యతిరేకతను చాటుకోడానికి ఇంతకన్నా మంచి సందర్భం దొరకలేదా? లేక పీవీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తే ఢిల్లీ అమ్మోరు ఆగ్రహిస్తారని భయపడ్డారా?

No comments:

Post a Comment