Monday, December 30, 2013

ఆమ్ ఆద్మీ పరేషాన్..

వెనుకటికి (90) చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గల్ఫ్ యుద్దం జరిగి ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీంతా పెరిగాయి.. మన దేశంలో కూడా పెట్రోలు, డీజీల్, గ్యాస్ ధరలు ఏకంగా 100 శాతం మేర పెరిగాయి.. కేంద్ర ప్రభుత్వం పొదుపు పాటించాలని పిలుపునిచ్చింది.. అప్పట్లో పీసీసీ అధ్యక్షనిగా ఉన్న వీ.హనుమంతరావు పొదుపు పేరిట ఓ రోజంతా రిక్షాలో తిరిగారు.. అసెంబ్లీకి, సచివాలయానికి ఆయన రిక్షలో రావడం, మందీ మార్బలం, సెక్కూరిటీ ఆయన వెంట తిరడం అందరికీ వింతగా కనిపించింది.. తీరా ఖర్చును లెక్కేస్తే ప్రతిరోజూ కారుకు అయ్యే ఇంధన వ్యయం కన్నా అధికంగా లెక్కతేలింది.. పోనీలే హనుమన్న ఎంతో కొంత పెట్రోలు ఆదాచేసి శ్రమశక్తి(రిక్షా)కి విలువ ఇచ్చారు కదా అని అంతా సరి పెట్టుకున్నారు..
కొద్ది కాలం క్రితం ఇంధన ధరలు, నిత్యావసర ధరలు పెరిగాయనే కారణంలో నిరసనగా చంద్రబాబు నాయుడు గారు, ఇతర ఎమ్మెల్యేలు సైకిల్ పై అసెంబ్లీకి వచ్చారు.. సంతోషమే. కానీ ఆయన రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ, ట్రాఫిక్ జామ్ ప్రజలను తీవ్రంగా ఇబ్బందిని పెట్టింది..
తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మెట్రోరైలులో వెళ్లారట.. ఇందుకు అనవసరర సెక్యూరిటీ హంగామా, ఖర్చును తగ్గించడం లాంటి కారణాలు చూపారు.. ఇదీ సంతోషమే. కానీ జరిగింది ఏమిటి? కేజ్రీవాల్ మెట్రోలో ప్రయాణిస్తున్నాడనే సాకును చూపి పోలీసు భద్రతా సిబ్బంది సాధారణ ప్రయాణీకులను  స్టేషన్ బయటే అడ్డుకున్నారట.. పాపం సాధారణ ప్రజలు (ఆమ్ ఆద్మీలు) తమ దైనందిన పనులకు సకాలంలో వెళ్లలేక ఇబ్బంది పడ్డారు.
ఈ మూడు ఘటనలు మంచి  చెడుల విషయాన్ని పక్కన పెడితే ఒకటి మాత్ర పక్కన స్పష్టంగా చెప్పగలను.. నాయకులు పబ్లిసిటీ జిమ్మిక్కుల కోసం ఎంతకైనా దిగజారతారు.. ఇందులో కేజ్రీవాల్ రెండాకులు ఎక్కువే చదివాడు..

No comments:

Post a Comment