Friday, December 6, 2013

నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఇక లేరు.. జులై 18 1918లో జన్మించిన మండేలా మహాత్మా గాంధీ స్పూర్తితో దక్షిణాఫ్రికాను శ్వేతజాతి పాలకుల నిరంకుశ పాలన నుండి విముక్తి చేయడానికి, నల్ల జాతి ప్రజల హక్కుల కోసం పోరాడారు.. ఫలితంగా 27 ఏడేళ్లు కారాగారవాసం అనుభవించారు.. 1993లో నోబుల్ శాంతి బహుమతి పొందారు.. 1994 నుండి 1999 దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా పని చేశారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మండేలా అర్ధరాత్రి కన్ను మూశారు.. భారత దేశంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది.. శాంతి యుతంగా పోరాటం సాగించిన మండేలాకు మహాత్మా గాంధీ స్పూర్తి కావడం విశేషం.. మండేలాకు హృదయ పూర్వకంగా నివాళులర్పిద్దాం..

No comments:

Post a Comment