Sunday, December 8, 2013

నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఏం చెబుతున్నాయి?..

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏక పక్షంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావడం కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టని అందరూ విశ్లేషిస్తున్నారు.. అయితే ఎన్నికల ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే ప్రజల్లో వచ్చిన చైతన్యానికి ప్రతీకగా చెప్పక తప్పదు.. ఫలితాలు నరేంద్ర మోడీ, బీజేపీ విజయంగా చెబుతున్నా దీన్ని మరో కోణంలో కూడాలి..
దేశ ప్రజలు స్వచ్ఛమైన పాలనను, సమర్ధ పనితీరును కోరుకుంటున్నారని ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కాకమునుపు నిజంగానే మధ్య యుగాల నాటి వాతావరణమే కనిపించేది.. బీమారీ రాష్ట్రాల్లో ఒకటిగా పేరొందిన ఈ రాష్ట్రంలో రోడ్లు, మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు దారుణంగా ఉండేవి.. చౌహాన్ ఈ పరిస్థితిని చాలా వరకూ మార్చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు.. నీతి నిజాయితీలకు ఆయన మారుపేరుగా నిలిచారు.. అందుకే శివరాజ్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది..
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్ గఢ్ లో డాక్టర్ రమణ్ సింగ్ హ్యట్రిక్ సైతం ఆశామాషీది కాదు.. ప్రజల వద్దకు అభివృధి ఫలాలును తీసుకుపోవడంలో ఆయన సఫలమయ్యారు.. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగు పరిచిన రమణ్ సింగ్ పేద ప్రజలకు చౌక బియ్యాన్ని సమర్ధ వంతంగా అందేలా చూశారు.. చావల్ బాబాగా పేరొందిన రమణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్ గఢ్ లొ శాశ్వతంగా సమాధి కట్టారనడంలో అతిశయోక్తి లేదు..
రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్రంగా విసిగిపోయారు.. గెహ్లాట్ పరిపాలనలో అవినీతి పరాకాష్టకు చేరడంతో ప్రజలు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి భారీ మెజారిటీతో అధికారం అప్పగించారు.. వసుంధరా రాజేపై అపారమైన విశ్వాసం కనబరచిన రాజస్థాన్ ప్రజల ఆశలను వమ్ము చేయకుండా పాలించే బాధ్యత ఇప్పుడు బీజేపీపై పడింది..
రేప్ సిటీగా, అసమర్థ పాలనకు నమూనాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం మూట గట్టారు.. అదే సమయంలో బీజేపీనీ హెచ్చరిస్తూ తీర్పు చెప్పారు.. సాంప్రదాయ పార్టీతో విసిడిపోయిన విద్యావంతులు, యువత అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీపై ఎంతో ఆసక్తిని కనబరచారు.. అందుకే ఆ పార్టీకి ద్వితీయ స్థానం దక్కింది.. అదే సమయంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా, స్పష్టమైన మెజారిటీ మాత్రం రాలేదు.. బీజేపీ నిజాయితీ పరుడైన హర్షవర్ధన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వల్లే ప్రజలు ఆ పార్టీకి ఎక్కువ సీట్లు అందించారు.. ఈ పని ఇంకా ముందు చేసి ఉంటే బీజేపీకి మరిన్ని సీట్లు వచ్చేవి..
దేశ ప్రజలు మార్పు కోరుతున్నది యదార్థమే అయినా అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన కావాలని వాంచిస్తున్నారని చెప్పేందుకు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, ఢిల్లీ ఫలితాలే నిదర్శణం.. అదే సమయంలో ఈ ఫలితాలు బీజేపీకి కూడా ముందస్తు హెచ్చరిక లాంటివి..

No comments:

Post a Comment