Sunday, December 1, 2013

వీరు మనుషులేనా అసలు?..

వారు తీవ్రవాదులు కాదు.. ప్రతిపక్ష పార్టీ వారు అసలే కాదు.. ఉద్యమకారులు కానేకాదు..
బస్సు ప్రమాదంలో అయిన వారిని పోగొట్టుకున్నవారు..
నెల రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు..
రవాణా మంత్రి బొత్సకు మొర పెట్టుకుందామని వచ్చారు.. కానీ అక్కడ జరిగిందేమిటి?.. పోలీసులు విరుచుకు పడ్డారు.. అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు.. ఆ సమయంలో జరిగిందేమిటో గమనించండి..
బస్సు ప్రమాదంలో భర్తను కోల్పోయి రోదిస్తున్న మహిళ చేతిలోంచి పోలీసులు రెండేళ్ల బాలున్ని లాక్కున్నారు.. అంతే కాదు ఆమె ప్యాంటును లాగేశారు.. ఈ ఘనకార్యం చేసింది మహిళా కానిస్టేబుల్సే..
ఇంత జరిగితే మంత్రి సత్తిబాబు మీడియాను తీసుకొచ్చి రాజకీయం చేస్తారా? అంటూ బాధితులపై రంకెలేశారట..
మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర జబ్బార్ ట్రావెల్స్ (దివాకర్ ట్రావెల్స్ వారి లీజు అట) కాలిపోయి 45 మంది సజీవ దహనం అయింది.. నెల రోజులైనా బాధితులకు న్యాయం చేయకుండా అటు జబ్బార్, దివాకర్ టావెల్స్ యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం నాటకాలాడుతున్నారు.. జబ్బార్, దివాకర్ ట్రావెల్స్ యజమానులను ఇంత వరకూ అరెస్టు చేసిన పాపాన పోలేదు ఈ సర్కారు.. పరిహారం వారే ఇవ్వాలి, థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ అంటూ కథలు చెబుతోంది.. భర్తలు, బిడ్డలు, తండ్రులు అయిన వారిని పోగొట్టుకొని జీవనాధారం ఏవిటో తెలియని అయోమయంలో ఉన్న బాధితులపట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?
ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నది ఎందుకో తెలుసా?.. ప్రభుత్వం తమ కష్ట సుఖాలు చూసుకుంటుందనే నమ్మకంతో.. వారి గాలికి వదిలేసే పాలకులను ఏమనాలి?
అసలు వీరు మనుషులేనా అసలు?.. మనవత్వం అనేది ఉందా వీరి కసలు?.. ఛీ ఛీ..

No comments:

Post a Comment