Friday, October 31, 2014

ఇదేం వైఖరి బుఖారీ..

మోదీకి నై.. షరీఫ్ కు జై.. ఇదండీ మన ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ విధానం.. తన తనయుడు షాబన్ కు నూతన ఇమాం బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన బుఖారీ సాబ్, భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం ఆహ్వనించడట.. ఎందుకంటే గజరాత్ అల్లర్లకుె మోదీ క్షమాపణ చెప్పలేదట..ఇదేం లాజిక్కో మరి.. మోదీ ముస్లిం వ్యతిరేకట..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారతీయ ముస్లింల దేశభక్తిపై ప్రధాని మోదీ ఇచ్చిన కితాబు అందరికీ గుర్తుండే ఉంటుంది.. మరి మోదీ ముస్లిం వ్యతిరేకని ఎలా చెప్పగలడీ బుఖారీ? భారతీయులంతా ఓట్లేసేనే కదా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు.. ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి.. మరి మోదీని వారు ఆమోదించినట్లా? తిరస్కరించినట్లా?
ఈ బేఖారీ బుఖారీ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. కొద్ది కాలం క్రితం ఢిల్లీకి వచ్చిన ఇమాం బుఖారీ దగ్గరుండీ మరీ జామా మసీదును చూపించారు.. తినేది భారత సొమ్ము.. పాడేది.... జాతీయవాద ముస్లింలు ఇలాంటి మత నాయకులు ద్వంద్వ వైఖరిని గమనిస్తూనే ఉన్నారు..

No comments:

Post a Comment