Friday, October 17, 2014

బయటపడ్డ ముషార్రఫ్ దుర్భుద్ది..

పాకిస్తాన్ నాయకుల దుర్భద్ది మరోసారి బయట పడింది.. భారత్ తో యుద్దానికి సిద్దమట.. వేర్పాటు వాదులను రెచ్చగొడతారట.. పాకిస్తాన్ మాజీ పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవి.. ఇందులో కొత్తేమీ లేదు.. ఇప్పటికే పాకిస్తాన్ చేస్తున్న పని ఇదే కదా..
భారత వ్యతిరేకతే పాకిస్తాన్ పాలకులకు మనుగడ.. వారి దేశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చడానికి ఇండియా మీద పడి ఏడవడం మామూలే.. గతంలో భారత ప్రధాని అటల్జీ పాకిస్తాన్తో సామరస్య వాతావరణం కోసం బస్సు యాత్ర చేపడితే, ఇది గిట్టని నాటి దేశ సైనిక దళాల ప్రధానాధికారి ముషార్రఫ్ కార్గిల్ దురాక్రమణకు పూనుకున్నాడు.. భారత్ సమర్ధవంతంగా తిప్పి కోట్టిన తర్వాత, తనపై వేటు పడుతుందనే భయంతో ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చి తానే పాలకుడయ్యాడు ముషార్రఫ్.. అప్పటి అరాచకాలకు విచారణ ఎదుర్కొంటున్న ఈ పెద్దమనిషి, పాక్  ప్రజల దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికి మళ్లీ పాత పాచి పాట అందుకున్నాడు..
మోదీ ముస్లిం, పాకిస్తాన్ వ్యతిరేకట.. పర్వేజ్ ముషార్రఫ్ అంటాడు.. మరి ముషార్రఫ్ హిందూ వ్యతిరేకి, భారత్ వ్యతిరేకి కాదా? మన ప్రధాని పదవి చేపట్టాక మోదీ ఏమైనా ముస్లిం వ్యతిరేక పనులు చేశారా? పాకిస్తాన్లో హిందువుల దుస్థితి ఏమిటి? ఇండియాలో మైనారిటీలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఆ దేశంలో ఉన్నాయా? పాకిస్తాన్లో కన్నా భారత్లోనే ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.. వారికి పాకిస్తాన్ కన్నా భారత్లోనే భద్రత ఉంది.. ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తూ కొట్టుకు చస్తున్నది ఎవరు? పాకిస్తానీలే కదా? పాకిస్తాన్ ప్రధానికి మోదీ స్నేహ హస్తం అందిస్తే, వేర్పాటు వాదులతో చర్చలు జరిపి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, సామరస్య వాతావరణాన్ని దెబ్బ తీసింది ఎవరు?

ముషార్రఫే కాదు, వాడి తాతలు, పాకిస్తాన్ పాలకులు, నాయకులు అంతా దిగి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉంది.. ముందు పాకిస్తాన్ తన అంతర్గత వ్యవహారాలను చక్కన పెట్టుకుంటే చాలు..

No comments:

Post a Comment