Wednesday, October 15, 2014

ఐఎస్ జేకే మతిలేని పనేనా?

పవిత్ర బక్రీద్ పండగ వేళ శ్రీనగర్లో ఐఎస్ఐస్ జెండాలు.. ఐఎస్ జేకే అట.. పేరు కూడా పెట్టుకున్నారు.. ప్రపంచాన్ని వణికిస్తున్న అతి ప్రమాద ఉగ్రవాద సంస్థ కాశ్మీర్లో ఉనికిని చాటుకోవడంతో దేశమంతా ఉలిక్కిపడింది.. ఒక్క ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్ప.. ఇదేమిటయ్యా అబ్దుల్లా అంటే.. అంతా ఉత్తిదే, కొందరు మతిలేని యువకులు చేసిన చిలిపి పనంటాడాయన.. సరదాగా ఓ దర్జీ దగ్గర ఆ జెండాలు కుట్టించుకున్నారట.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి ట్వీట్ ఇచ్చాడు కుంభకర్ణ+ధృతరాష్ట్ర వారసుడు.. నిద్ర+దృష్టిలేమితో బాధపడుతున్నాడు మరి.. జెండాలు పట్టిన ఆ యువకులు మతిలేని వారే అయితే ఎందుకు పిచ్చాసుపత్రిలో చేర్చలేదు? అంత ధైర్యం ఉందా?

కాశ్మీర్ ఇప్పటికే వేర్పాటు వాదుల గుప్పిట్లో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.. ఓట్ల కోసం మతిలేని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వీరిని చూసీ చూడనట్లు వదిలేశాయి.. ఇప్పటికే ఉన్న ఉగ్రవాద శక్తులకు తోడు ఇస్లామిక్ దేశాలను సైతం గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ కాశ్మీర్లో ప్రవేశించినట్లు స్పష్టమైపోయింది.. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. మొన్నటి వదరల్లో దేశ ప్రజలంతా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలిచారు.. అదే విధంగా ఉద్రవాద కోరల్లోంచి భారతమాత మకుటాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment