Wednesday, October 22, 2014

సేమ్ టు సేమ్..

రాజకీయాల్లో విదూషక పాత్రలు కరువైపోతున్న తరుణంలో ఇరుగు పొరుగు దేశాలకు మంచి హాస్యగాళ్లు దొరికారు.. మన పప్పూ ఈ మధ్య ఒక బహిరంగ సభలో మోదీని ప్రతిపక్ష నాయకుడు అని సంబోధించాడట.. పాపం ఆయనకు వార్తా పత్రికలు చదివే అలవాటు, టీవీలో వార్తలు చూసే తీరిక లేనట్లున్నాయి.. ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నట్లున్నాడు పాపం.. ఒకవేళ పొరపాటుగా ప్రతిపక్ష నాయకుడు అన్నాడని సరిపెట్టుకున్నా, మోదీ గతంలో ఎప్పుడూ ప్రతిపక్ష నేతగా పని చేసిన దాఖలాలు లేవు.. అన్నట్లు పాపం వారి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు..
ఇక మన పొరుగున ఉన్న పిల్లకాకి ఎప్పుడు ఏం మట్లాడతాడో ఆయనకే తెలియదట.. తమ దేశానికి క్రిస్టియన్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు ఆ మధ్య ఆయన చేసిన కామెంట్ గగ్గోలు పెట్టించింది.. ఈ మద్య పదే పదే కాశ్మీర్ ను లాక్కుంటాం అని అరుస్తోందా పిల్లకాకి.. ఈ కావురు కేకలను పెద్దగా పట్టించుకోనక్కరలేదంటున్నారు మన పొరుగువారు..
ఎందుకు అంటే మనకు పప్పూ ఎలాగో వారికి ఆ పిల్లకాకి అలాగట.. 

No comments:

Post a Comment