Thursday, October 2, 2014

జై జవాన్.. జై కిసాన్.

ఎంత గొప్ప నినాదం ఇది.. భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపింది..
చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. అంతలో పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. శాస్త్రీజీ ఆ దేశం మేరకు మన సైనం శత్రువులను తక్కుగా ఓడించింది.. దేశమంతా విజయ గర్వంతో మళ్లీ తలెత్తుకుంది.. దేశ రక్షణ భాధ్యతలు చూసే సైనికుడు, అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు జై కొడుతూ లాల్ బహద్దూర్ శాస్త్రీ ఇచ్చిన ఈ నినాదం ఈనాటికీ మనకు స్పూర్తిని ఇస్తుంది..
శాస్త్రీజీ జీవితం నేటి నేతాజీలకు ఆదర్శం కావాలి.. గాంధీజీ మాదిరిగానే నిరాడంబరంగా జీవించారాయన.. శాస్త్రీజీ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో ఓ రైలు ప్రమాదం జరిగింది.. ప్రయాణీకులకు భద్రత కల్పించలేకపోయానన్న పశ్చాతాపంతో నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారు.. ఈ రోజులు పదవులను అంటి పెట్టుకునే నాయకులనే చూశాం కానీ, అలాంటి గొప్ప నేతలు కనిపిస్తున్నారా?
భారత్ పాక్ ల మధ్య తాష్కెంట్ లో జరిగిన చర్చల తర్వాత అదే రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు లాల్ బహద్దూర్ శాస్త్రీజీ.. లాల్ బహద్దూర్ జీ దేశ ప్రధానిగా ఉన్నది కొద్ది రోజులే.. కానీ ఆ పదవికి గొప్ప గుర్తింపు తెచ్చారు.. ఆ మహనీయుని జన్మదినం ఈరోజు.. వారికి ఘన నివాళులు అర్పిస్తూ గుర్తుకు తెచ్చుకుందాం..

No comments:

Post a Comment