Wednesday, October 8, 2014

ఆశయాలను నెరవేర్చడమే భీమ్ కు సరైన నివాళి..

జల్-జంగిల్-జమీన్ ఆయన నినాదం.. కానీ ఆదివాసుల నేటికీ అవి తీరని కోరికలే..
ఆదివాసుల హక్కుల కోసం నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన గోండు యోధుడు కొమురం భీమ్ వీరమరణం పొంది 74 ఏళ్లు పూర్తయ్యాయి.. నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే ఆదివాసీలు కోరుకునేది స్వేచ్ఛాయుత జీవితం.. అడవులపై ఆధారపడి జీవించే వీరికి, వాటిపై హక్కులేదు పొమ్మంటే ఎక్కడికి పోగలరు.. కొండలు, కోనల్లో పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడంతో పాటు, పన్నులు వెట్టి చాకిరితో గిరజనులను వేధిచింది నిజాం ప్రభుత్వం.. ఇలాంటి పరిస్థితుల్లో భీమ్ తిరగబడ్డాడు.. ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ కొండల్లో సాయుధ పోరాటం చేపట్టిన కొమురం భీమ్ నిజాం సైన్యం అంతమొందించింది..
భీమ్ త్యాగం వృధాగా పోలేదు.. ఆయనను స్పూర్తిగా తీసుకొని తర్వాత కాలంలో చేపట్టిన పోరాటాల ఫలితాలే 1/70 చట్టం, అటవీ హక్కులు, గిరిజన చట్టాలు వచ్చాయి.. కానీ ఇవన్నీ కంటిపుడుపు చర్యలుగానే మారాయి. అభివృద్ది పేరిట అడవులన నిర్మూళన.. ప్రాజెక్టులు, గనులు అంటూ గూడులేని నిర్భాగ్యులుగా మార్చేస్తున్న వైనం ఆదివాసీలకు శాపాలుగా మారాయి..
కొమురం భీమ్ పోరాటాన్ని, ఆయన చరిత్ర గుర్తించడానికే ఇన్నేళ్లు పట్టడం దారుణం.. భీమ్ జయంతులు, వర్ధంతులు నిర్వహించడమే ఆయన స్మరణ కాదు.. ఆయన ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి.. జై భీం

No comments:

Post a Comment