Friday, October 10, 2014

కుక్క తోక సరిదిద్దాల్సిందే.. పాక్ కు బుద్ది చెప్పాల్సిందే

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. సరిహద్దు గ్రామాలు, చెక్ పోస్టులపై విచక్షణా రాహితంగా కాల్పులకు దిగింది.. భారత సైన్యం అంతే ధీటుగా జవాబిచ్చింది.. ఇలాంటి వార్తలు మనకు రొటీన్ అయిపోయాయి.. కానీ ఎందుకిలా జరుగుతోంది?.. భారత్ గట్టిగా తిప్పికొట్టలేకపోతోందా?.. ఆలోచించండి?
భారత్, పాక్ దేశాల మధ్య పోరాటం సర్వసాధారణమైపోయింది.. భారత్ పట్ల శతృత్వం, ఈర్ష, అసూయ, విధ్వేషం లేకుండా పాకిస్తాన్ మనుగడ సాధించలేదు.. అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాక్, వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఇండియాను బూచిగా చూపించి పబ్బంగడుపుకుంటోంది.. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి వరుసగా ఐదేళ్లయినా ప్రజాస్వామ్య ప్రభుత్వం మనుగడ సాగించలేదు.. సైన్యం, ఐఎస్ఐ కనుసన్నల్లోనే ప్రభుత్వాలు నడవాలి.. తోకజాడిస్తే పడగొట్టి సైనికాధికారలు నేరుగా అధికారం చేజిక్కించుకుంటారు..
పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలు భారత దేశంలో ఎన్ని చర్చలు జరిపినా, ఒప్పందాలు చేసుకున్నా బూడిదలో పోసిన పన్నీరే.. సైన్యం, ఐఎస్ఐ వాటిని పట్టించుకోవు.. వాటి పని అవి చేసుకుపోతాయి.. కార్గిల్ యుద్దం, సరిహద్దుల్లో కాల్పులు దీనికి ఉదాహరణ..
2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదేపదే ఉల్లంఘిస్తోంది.. ఇప్పటికి కొన్ని వేల ఘటనలు, మరణాలు చోటు చేసుకున్నాయి.. తాజాగా అ అక్టోబర్ 1వ తేదీ నుండి జరుగుతున్న పాకిస్తాన్ కాల్పుల్లో 8 మంది పౌరులు చనిపోయారు.. 80 మందికి పైగా గాయపడ్డారు.. వీరిలో 9 మంది సైనికులు ఉన్నారు.. సరిహద్దు గ్రామాల్లో దాదాపు 30 వేల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.. అయితే భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.. పాకిస్తాన్ భూభాగంలో ఇంకా ఎక్కవే నష్టం జరుగుతోంది. కానీవారు పట్టించుకోరు.. తమ రెండు కళ్లు పోయినా పర్వాలేదు.. భారత్ కు ఒక కన్నుపోతే చాలు అన్నదే వారి వైఖరి..వారి తప్పును కప్పిపుచ్చుకొని, భారత్ తమను కవ్విస్తోందని అంతర్జాతీయ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటోంది పాక్..
భారత్, పాక్ ల మధ్య ఇప్పటికి నాలుగు యుద్దాలు జరిగాయి..అన్నిట్లో ఘన విజయం మనదే.. అయినా పాక్ వైఖరి మారదు.. కుక్క తోట వంకరే కదా?.. అయితే పదే పదే రెచ్చగొడుతుంది.. ఈ సారి మాత్రం గట్టి గుణపాఠమే చెప్పక తప్పేలా లేదు..

No comments:

Post a Comment