Thursday, October 2, 2014

స్వచ్ఛ్ భారత్ విజయవంతం కావాలి..

స్వచ్ఛ్ భారత్.. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లాగే ఇదొకటి అనుకుంటే పొరపాటు.. దీని వెనుక మహోన్నత లక్ష్యం ఉంది.. ప్రతి ఒక్కరూ కనీసం వారానికి రెండు గంటలు కేటాయించి మన ఇళ్లు, వాకిలి, కార్యాలయ పరిసరాలు, వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి.. 2019లో మహాత్మా గాంధీ 150 జయంతి నాటి భారత దేశం మొత్తాన్ని శుభ్రం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన బృహత్తర ఉద్యమం ఇది.. స్వచ్ఛ్ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల కార్యక్రమం..
చెత్త తయారు చేయడం మన పని.. ఎత్తేయడం మున్సిపాలిటీ వారి పని.. మనం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఏమిటి?.. ఇలా ఆలోచించేవారి మనసిక స్థితిని కచ్చితంగా శంకిచాల్సిందే.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనవంతు కర్తవ్యంగా భావించాలి.. పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.. కానీ అపరిశుభ్ర వాతావరణం, అనారోగ్య సమస్యలను దూరం చేయలేకపోతున్నాం.. ఎక్కడుంది లోపం?.. కచ్చితంగా మన ఆలోచనా విధానంలోనే లోపం ఉంది.. కసువు తీసుకెళ్లి వీధి చివర చెత్త కుండీలోనే వేయాలనే స్పృహే చాలా మందికి లేదు.. సిగరెట్లు కాల్చి రోడ్డు మీద విసిరేస్తారు.. పాన్, వక్కపొడి, గుట్కాలు ఊమ్మేస్తాం.. ఆహార పదార్ధ్యాల వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం.. రోడ్లపై విఛల విడిగా కాలుష్యాన్ని సృష్టిస్తాం..  ఇదేగా మనం చేస్తున్న పని..

దేశానికి స్వాతంత్ర్యం కన్నా, పరిశుభ్రతకే తాను ప్రధాన్యత ఇస్తానని మహాత్మా గాంధీ ఆనాడే చెప్పారు.. గాంధీ జయంతి రోజున ప్రారంభమైన మహా ఉద్యమం స్వచ్ఛ్ భారత్.. ఈ మహాక్రతువు విజయవంతంగా పూర్తి కావాలని ఆశిద్దాం.. అందులో మనవంతు పాత్రను మరిచిపోవద్దు.. జై హింద్.. జై స్వచ్ఛ్ భారత్..

No comments:

Post a Comment