Friday, February 28, 2014

టీఆర్ఎస్ లోనే కాంగ్రెస్ కలవాలి..

వందేళ్ల కాంగ్రెస్ పార్టీని భారత రాజకీయాల్లో పాతుకుపోయిన ఊడల మర్రిగా అభివర్ణిస్తారు.. నాకు మాత్రం అది దయ్యాల మర్రిగానే కనిపిస్తుంది..
సోనియాగాంధీ తెలంగాణ ఒచ్చిందని కృతజ్ఞతలు చెప్పుకుంటున్న తెరాస వర్గాలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడి ఉండాలి.. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తాం అని కేసీఆర్ గతంలో ప్రకటించారు.. అప్పటి పరిస్థితులు వేరు.. తెలంగాణ డిమాండును తొమ్మిదేళ్ల పాటు పక్కన పెట్టి వేయి మంది బలిదానాలకు, అమాయకులు చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ, హఠాత్తుగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిచడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి..
అవినీతి, అసమర్ధ పాలన కారణంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతిన్నది.. అవిభక్త ఆంద్రప్రదేశ్ లోనూ వారి పాలన ప్రజలకు రోత పుట్టించింది.. ఈ క్రమంలో పార్టీ ఉనికిని కాపాడు కోవడానికి ఏ పని చేస్తే ఎక్కడెక్కడ ఓట్లు వస్తాయో అంఛనాలు వేసుకున్న కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ గుర్తు కొచ్చింది.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి వల్ల ఇక్కడ గంపగుత్తగా సీట్లు వస్తాయనే ఆలోచనతో ఎన్నికల ముందు హడావుడిగా తెలంగాణను ఏర్పాటు చేసేసింది..
ఇప్పడు విలీనం కావాల్సిందిగా తెరాస మీద వత్తిడి పెంచుతోంది కాంగ్రెస్.. నిజానికి ఇప్పడు తెలంగాణలో కాంగ్రెస్ కన్నా తెరాసయే బలమైన శక్తి.. వంటరిగా పోరాడి ఉనికి కాపాడుకోవాలని గులాభీయులు భావిస్తున్నారు.. తెరాస ఎటూ పాటుపోలేని స్థితిని గమనించిన కాంగ్రెస్ అదిష్టానం నెమ్మదిగా ఆ పార్టీ నేతలను లాగడం మొదలు పెట్టింది.. ఆ విధంగానే ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. టీఆర్ఎస్ కూడా ఏం తక్కువ తినలేదు.. కేకేతో పాటు ఎంపీలు వివేక్, మందలను కలుపుకున్న తీరు గమనించాలి..

ఇక విలీనం, ఉనికి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కలవడ కాదు.. టీఆర్ఎస్ లోనే కాంగ్రెస్ కలిసిపోతే బెటరు.. దేశ వ్యాప్తంగా ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంతో ఇంతో ఓట్లు రాలుతాయంటే అంది తెలంగాణ పుణ్యమే.. సీమాంధ్రలో ఆ పార్టీకి ఒకటి, రెండు సీట్లయినా వస్తాయా అన్నది అనుమానమే.. ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా ఇదీ వాస్తవం..

No comments:

Post a Comment