Friday, February 14, 2014

భారత ప్రజాస్వామ్యంపై మచ్చ.

ప్రేమించ లేదనే కోపంలో అమ్మాయిపై యాసిడ్ పోసిన వారిని చూశాం.. ఇప్పుడు తమకు ఇష్టం లేని బిల్లు పెడుతున్నారనే అక్కసుతో తోటి ఎంపీలపై పెప్పర్ గ్యాస్ స్ప్రే చేసిన వారిని చూడాల్సి వచ్చింది..
తెలంగాణ రాష్ట్రం కోరుకోవడమే తప్పని ఎవరైనా భావించే వారు, ప్రేమించక పోవడం ఆ అమ్మాయి చేసిన తప్పది వాదించగలరా?
ఎవరు ఎలా వాదించినా ప్రపంచంలో అతి పెద్దదైన భారత ప్రజాస్వామ్యం పరువుపోయింది.. తమకు నచ్చని ఎజెండా పార్లమెంట్ చేపట్టినంత మాత్రాన గుండాల్లా కొట్టుకోవాలా? ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించాలా? ఆ పనేది బయటే చేసేయొచ్చుగా.. బిల్లును అడ్డుకునే ఎంపీలు, వారిని ఎదుర్కొనేందుకు వచ్చిన ఎంపీలు సృష్టించిన సీను చెత్త కుప్ప దగ్గర కుక్కల కాట్లాటను తలపించింది..
ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాలరాసే ప్రయత్నమే ప్రజాస్వామ్యమా? తెలంగాణ బిల్లులో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే పార్లమెంట్ లో ఎండగట్టవచ్చు.. తాము కోరుకునేవి సాధించుకునే ప్రయత్నం చేయవచ్చు.. అసలు రాష్ట్ర విభజనే వద్దనుకుంటే వాకౌట్ చేయవచ్చు.. లేదా రాజీనామా చేయవచ్చు.. కానీ సభను అడ్డుకుంటాం.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే సహించం.. ఎంతకైనా తెగిస్తాం అని బెదిరించడం సమంజసమా?
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ చట్ట సభల ప్రతినిధులమనే ఇంగితం అయినా లేకుండా రౌడీయిజం ప్రదర్శించడం ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ నగ్న స్వరూపం స్పష్టంగా బయటపడిపోయింది.. సొంత పార్టీ మంత్రులపై, ఎంపీలపై పట్టులేదని చేతులెత్తేసింది.. సీమాంధ్ర ఎంపీలను కట్టడి చేసేందుకు తెలంగాణ ఎంపీలను, ఇతర రాష్ట్రాల ఎంపీలను ఉసిగొల్పడాన్ని ఏవిధంగా సమర్థించగలం?

No comments:

Post a Comment