Tuesday, February 25, 2014

మహేందర్ రెడ్డి జర్క్..

మల్కాజిగిరి నుండి తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారని ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్ రెడ్డి.. ఆయన పోటీ చేయకపోతే తానే పోటీ చేస్తానని చెప్పాడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న వేళ ప్రజలంతా టీడీపీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు..

కట్ చేస్తే రెండో రోజునే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్త.. తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొనేందుకు మహేందర్ రెడ్డి, మరో టీడీపీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం తమ పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ ప్రకటించారు.. తెలంగాణ విషయంలో టీడీపీ తీసుకున్న ద్వంద్వ వైఖరి ఆ పార్టీ నేతలను ఎంత ఇరకాటంలో పెట్టిందో చూశారా?.. మహేందర్ రెడ్డి టీడీపీ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షునిగా పని చేశారు.. అలాంటి నాయకుడే టీడీపీ పట్ల నమ్మకం కోల్పోయాడంటే సాధారణ కార్యకర్తల భయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు..
 

No comments:

Post a Comment