Saturday, February 15, 2014

అరాచక పాలన ముగిసింది..

తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట.. ఇలాంటి కోతికి కొబ్బరి కాయ దొరికితే ఎలా ఉంటుంది.. కేజ్రీవాల్ చేసిన పని అలాగే ఉంది..
అరవింద్ కేజ్రీవాల్ గొప్ప త్యాగ పురుషుడని భజన చేస్తున్న వారు తమ భ్రమలు వీడి వాస్తవ దృక్పదంతో ఆలోచించండి.. అందరూ అవినీతి పరులని, చేతగాని వారని బురద చల్లేస్తూ తానొక్కడినే పోటుగాన్నని విర్రవీగిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా వెలగబెట్టింది ఏమిటి? ఎప్పుడూ టీవీ స్టూడియో డిబేట్లు, లైవ్ షోల్లో కనిపిస్తూ హడావుడి చేయడం తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టింది ఎప్పుడూ.. ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా ఉండేలా చూసుకుంటూ మీడియా ప్రచార యావతోనే ఆయన పాలనా కాలం సరిపోయింది..

తాను అరాచవాదినని కేజ్రీవాలే ఒప్పుకున్నాడు.. ఆయన చేసిన పనులూ అలాగే ఉన్నాయి.. మనం ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు అది సాధించే వరకూ అప్రమత్తంగా ఉండాలి.. రాత్రికి రాత్రే గమ్యాన్ని చేరాలనుకోవడం కొన్ని సందర్భాల్లో అసాధ్యం.. జన్ లోక్ పాల్ బిల్లు తీసుకురావడానికి కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం ఎలా ఉందో గమనించండి.. ఈ బిల్లు తీసుకురావడానికి తనకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ను కానీ, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీని కానీ సంప్రదించలేదు.. పైగా లెఫ్టినెంట్ గవర్నర్, రాజ్యాంగ వ్యవస్థను కూడా ఖాతరు చేయలేదు.. నిజానికి ఢిల్లీ అసెంబ్లీ తిరస్కరించింది లోక్ పాల్ బిల్లును కాదు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా దొడ్డి దారిలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీరునే మెజారిటీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు.. వాస్తవాలను పక్కన పెట్టి తానేదో మంచి చేస్తుంటే వారు అడ్డు పడ్డారని సాకు చూపించి రాజీనామా చేయడం కేజ్రీవాల్ కే చెల్లింది..
అవినీతిపై పోరాటం అంటే మీరు అవినీతి పరులని ఎదుటి వారిపై బురద చల్లడం కాదు.. నిర్దుష్టమైన ఆధారాలతో వారి అవినీతి పరులుగా నిరూపించే ప్రయత్నం చేయాలి.. మాజీ సీఎం షీలా దీక్షిత్ విషయంలో కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాను.. అయితే కేజ్రీవాల్ అవినీతి పరులను, నీతి మంతులను ఒకే గాటాన కట్టి నిందలు వేయడం దారుణం.. తమపై అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు చూపించాలని ఆ నాయకలు సవాలు చేస్తే ఇంత వరకూ స్పందించలేదు..
కేజ్రీవాల్ తాను ఢిల్లీ సీఎంగా ఉన్నానని మరచిపోయి పోలీసులకు వ్యతిరేకంగా రోడెక్కి ధర్నా చేసినప్పుడే ఆయన అసహాయ స్థితి, అజ్ఞానం బయటపడిపోయింది.. సీఎంగా ఉండి ధర్నాలు చేయొద్దని రాజ్యాంగంలో లేదని దబాయించారు.. మరి సీఎంలు ధర్నాలు చేయొచ్చని ఉందా అని ప్రశ్నిస్తే సమాధానం కరువు.. కేజ్రీవాల్ క్యాబినెట్లో వివాదాస్పద మంత్రుల గురుంచి చెప్పాలంటే సమయాన్ని వృధా చేసుకోవమే తప్ప ఫలితం ఉండదు.. నేను గతంలోనే  ప్రస్థావించినందున వాటి జోలికి పోవడంలేదు.
అరవింద్ కేజ్రీవాల్ గతంలో ఐఆర్ఎస్ ఉద్యోగి.. తన శాఖలో అవినీతిని సరిదిద్దడం చేతగాక, దేశాన్ని ఉద్దరిస్తానంటూ రాజీనామా చేశారు.. కేజ్రీవాల్తో పాటు, ఆయన సతీమణి సర్వీసంతా ఎలాంటి బదిలీలు లేకుండా ఢిల్లీలో గడిచి పోయింది.. అందుకు మంచి పైరవీలే చేయించుకున్నారంటారు.. ఇది మాత్రం నీతివంతమైన పనే కదూ?..
ఒక  ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే అవకాశం ఉన్నప్పడు, చట్ట విరుద్దమైన అడ్డదారిలో వెళతానంటూ హడావుడి చేసి చతికిల పడ్డ కేజ్రీవాల్.. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రత్యర్ధులపై దాడినే అస్త్రంగా ఎంచుకున్నాడు.. మొత్తానికి ఢిల్లీ ప్రజలకు అరాచక పాలన వదిలినందుకు సంతోషించాల్సిందే..

No comments:

Post a Comment