Friday, February 7, 2014

ఇదేం విష ప్రచారం?..

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అనే సామెత వినే ఉంటారు..
బీజేపీ తెలంగాణకు మద్దతు ఉపసంహరించుకుందట.. మోకాలొడ్డుతుందట.. పార్లమెంటులో బిల్లును అడ్డుకునే కుట్ర పన్నిందట.. చంద్రబాబు ఆ పార్టీని ప్రభావితం చేసిండట.. వెంకయ్య చక్రం తిప్పుతుండట.. ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందట.. ఇందులో నిజం కన్నా అటలే ఎక్కవగా కనిపిస్తున్నాయి..
కొందరు వ్యక్తులు, అందునా మీడియా పర్సన్స్ పని గట్టుకొని చేస్తున్న ప్రచారం ఇది.. ఇలాంటి వార్తలు విని తెలంగాణా వాదులు ఆందోళనకు గురవుతున్నారు. బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు.. ఇక్కడో విషయాన్ని గమనించాలి.. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ ఏమైనా ప్రకటించిందా?.. అసలు ఇంత వరకూ బిల్లే రూపొందలేదు.. చర్చే జరగలేదు.. అప్పుడే ఈ అనుమానాలు ఎందుకు?..
ప్రతి పార్టీకీ వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి.. దీని ప్రకారమే బీజేపీ ముందుకు పోతోంది.. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ ఇవ్వకుంటే తామే ఇస్తామని బీజేపీ నేతలు సష్టంగా చెబుతుంటే, గ్రుడ్డు మీద ఈకలు పీకే ఈ దుష్ప్రచారం ఎందుకు? వారు వ్యూహాత్మకంగా మాట్లాడే మాటలకు పట్టుకొని అదిగో బీజేపీ మోసం చేస్తోంది అంటూ మొత్తుకుంటున్నారు.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీడీపీలో ఇంతగా డ్రామాలాడుతుంటే వదిలేసి, బీజేపీని టార్గెట్ చేయడంలోనే కుట్ర కనిపిస్తోంది.. వీరి కుట్రలో తెలిసో, తెలియకో ఇతర మిత్రులు కూడా భాగస్వాములు అవుతున్నారు..
తెలంగాణ ఇవ్వడంతో పాటు సీమాంధ్ర ప్రాంతానికీ న్యాయం చేయాలని కోరడమే, బీజేపీ పాపమా? ఒక అఖిల భారత, జాతీయ పార్టీగా అన్ని ప్రాంతాల గురుంచి మాట్లాడటంలో తప్పేమన్నా ఉందా? సీమాంధ్ర బీజేపీ నాయకులు మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారు.. అయితే తమ ప్రాంతానికి అన్యాయం చేయొద్దని, ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతున్నారు.. ఇందులో తప్పు పట్టాల్సింది ఏముందు?

బీజేపీ మీద దుష్ప్రచారం చేస్తున్న మహానుభావులు ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మద్దతు ప్రకటించినవారు కాదు, వారు ఏనాడూ బీజేపీతో కలిసి వచ్చిన వారు కాదు.. తెలంగాణను కోరే శక్తులు, పార్టీ మధ్య ఐక్యత కోసం ప్రయత్నించిన పాపాన పోలేదు.. ఇప్పడు తెలంగాణ సాకారమౌతున్న కీలక సమయంలో మాత్రం బురద జల్లుతున్నారు.. ఇందులోని కుట్ర కోణాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది.. 

No comments:

Post a Comment