Wednesday, February 26, 2014

వీరిని మరచిపోయారా నాయనా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని నిరంతరం తపించి, తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్.. వారు రగిల్చిన ఉద్యమ స్పూర్తి మహత్తర శక్తిగా ఎదిగి ఈనాడు స్వరాష్ట్రం సాక్షాత్కరిస్తోంది.. వీరిలో ఒకరు రాజకీయ మార్గంలోనే ఉద్యమం కొనసాగాలని సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చి అమలు చేశారు.. మరొకరు ఉద్యమ పార్టీకి తన ఇంటినే ఇచ్చి ప్రభుత్వ ఆగ్రహాన్ని చవి చూశారు.. 
తెలంగాణ ఉద్యమ ఫలాలను తమ సొంతానికి, వారసులకు ఇవ్వకుండా నిజమైన త్యాగాలు చేసింది బాపూజీ, జయశంకర్ మాత్రమే.. తమ జీవిత కాలంలోనే స్వరాష్ట్రం ఏర్పడుతుందని కలలుగన్నారు వారు.. కానీ కొద్ది సంవత్సరాల క్రితమే వారు మన ముందు లేకుండా పోయారు.. దురదృష్టవశాత్తు ఈనాడు వీరిని తలచుకునే వారే కరువయ్యారు.. కొందరు నాయకులు వీరి విగ్రహాలకు పూల దండలు వేస్తూ, వారి త్యాగ ఫలాలను తాము, తమ కుటుంబాలు అనుభవించేలా జాగ్రత్తపడుతున్నారు.. మిగతా సోకాల్డ్ తెలంగాణ వాదులు వీరిని పూర్తిగా మరచిపోయారు.. పత్రికా ప్రకటనలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లలో కూడా వీరి చిత్రాలు కనిపించకుండా జాగ్రతపడుతూ.. తమ సొంత పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు.. వీరిన చూసి నేను సిగ్గుపడుతున్నాను.. ఛీ ఛీ..

No comments:

Post a Comment