Saturday, February 1, 2014

ఈ గురవింద మాత్రమే సుద్దపూస అట..

వీరు అవినీతి పరులు, వీరిని ఓడించండి అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఓ చిట్టా విప్పారు.. మంచిదే అవినీతిపై పోరాటం చేసేవారు ఎవరైనా ప్రోత్సహించాల్సిందే.. మరి సుద్దలు వల్లిస్తున్న కేజ్రీవాల్ సంగతేంటో ఓసారి చూడండి...
అవినీతి రహిత సమాజం అంటూ గొప్పలు చెబుతున్న కేజ్రీవాల్ తో సహా ఆమ్ అద్మీ పార్టీ నేతల వ్యవహారం మొదటి నుండీ సందేహాస్పదంగానే ఉంది. వీరి అంతర్జాతీయ సంబంధాలు విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నాయి.. భారత దేశ వ్యతిరేక, విచ్చిన్నకర శక్తుల నుండి సైతం విరాళాలు దండుకున్న చరిత్ర వీరిది..
భారత్ ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్న ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ) సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ, చైనా సెక్యూరిటీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తున్న అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్.. కేజ్రవాల్, మనీష్ సిసోడియాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ కబీర్ కు రూ.86,61,742 రూపాయలను అందించినట్లు పత్రికల్లో వచ్చింది.. అమెరికాకే చెందని మరో సంస్థ పీఆర్ఐఏ, డచ్ ఎంబసీ, యునైటెడ్ నేషనల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ల నుండి కూడా నిధులు అందాయి.. మూడేళ్లలో నాలుగు లక్షల డాలర్ల విదేశీ నిధులు  సంస్థకు చేరాయట..  సాధారణంగా ఈ సంస్థలు సేవ ముసుగులో ఒక మతానికి ప్రచారం కోసం నిధులు ఇస్తాయనేది బహిరంగ రహస్యం.. ఆమ్ ఆద్మీ పార్టీలోని పలువురు వివాదాస్పద వ్యక్తులకు కాశ్మీర్ వేర్పాటువాద, మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం..
తమకు పాకిస్తాన్ నుండి సైతం విరాళాలు వస్తాయని కేజ్రీవాల్ ఒకసారి గొప్పలకు పోయాడని పత్రికల్లో చదవివాను.. మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న శత్రు దేశం నుండి విరాళాలు తీసుకునేందుకు సిగ్గు పడాలి.. ఇది దేశ విద్రోహక చర్యే అవుతుంది..
ఇలాంటి వారా సచ్ఛీలత గురుంచి, అవినీతి మాటలాడేది.. కేజ్రీవాల్ సుద్దపూస ఏమీ కాదు.. గురవింద తన కింది నలుపును చూసుకోకుండా ఇతరుల నలుపును చూసి వెటకారంగా నవ్వుతుందట.. మనోడి కత కూడా అట్లే ఉంది.. అవినీతి పాలన అందిస్తున్న ఘన చరిత్రను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పేరు కేజ్రీ చిట్టాలో ఎందుకు లేనట్లు?.. ఆమెతో ఆయనకు ఉన్న రహస్య సంబంధాలు ఏమిటి?..  

కేజ్రీవాల్ ముసుగు వ్యవహారాలు తెలియక పలువురు ప్రవాస భారతీయులు ఈయనో పెద్ద పోటుగాడని భావించి భూరి విరాళాలు పంపారు.. ఈయన ఢిల్లీ సీఎం అయిన తర్వాత ముసుగు తొలిగిపోయి, ఆప్ మంత్రుల ఆగడాలు చూసి ఎన్నారైలు బాధ పడుతున్నారట?.. ఇప్పటి దాకా వచ్చిన నిధుల ప్రవాహం క్రమంగా తగ్గిపోయాయనే అక్కసుతోనే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలపై ఎదురు దాడులకు దిగుతున్నారట..

No comments:

Post a Comment