Friday, January 10, 2014

మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బృందంలోని కీలక సభ్యురాలు, భారతదేశ తొలి ఐపీఎస్ అధికారణి కిరణ్ బేడీ  తాను మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు మనసులో మాట బయట పెట్టారు. స్థిర భారత్‌ కోసం, దేశంలో మెరుగైన పాలన కోసం, పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధి కోసం తన ఓటు బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకేనని కిరణ్‌బేడీ బహిరంగ మద్దతు ప్రకటించారు.
దేశం సుస్థిరంగా ఉండాలంటే అనుభవజ్ఞుడితోనే  సాధ్యమంటూ ఆమె వ్యాఖ్యానించారు. అవినీతి రహిత భారత్‌ కావాలంటే మోడీకే పట్టం కట్టాలని కిరణ్‌ బేడీ పిలుపునిచ్చారు.
ట్విట్టర్ ద్వారా కూడా కిరణ్‌ బేడీ తమ మద్దతును తెలియజేశారు. మోడీకి ఓటెయ్యాల్సిన ఆవశ్యకతను తెలియ చేశారు. (నా ట్విట్టర్ అకౌంట్లో కిరణ్ బేడీ ట్వీట్ చూడొచ్చు)

కిరణ్ బేడీ మద్దతుతో అన్నా బృందం మద్దతు మోడీకే అనే సంకేతాలు పంపినట్లు అయ్యింది. అవినీతికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం జరుపుతోన్న అన్నా హజారే బృందం అవినీతి రహిత భారత్‌ కోసం మోడీకి మద్దతివ్వడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆర్మీ మాజీ చీఫ్‌ వికెసింగ్‌ బిజెపిలో చేరనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో కిరణ్‌బేడీ. మోడీకి బహిరంగంగా మద్దతు పలకడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కిరణ్‌బేడీ మోడీకి మద్దతు పలకడాన్ని బిజెపి స్వాగతించింది. ఐపీఎస్‌ అధికారిగా దేశంలో గొప్పపేరు తెచ్చుకున్న బేడీ. మోడీకి మద్దతు పలకడం శుభపరిణామమని వ్యాఖ్యానించింది.
ఈ సంకేతాలు కేజ్రీవాల్‑కు అన్నా బృందం దూరం అయ్యినట్లుగా కనిపిస్తున్నాయి.  

No comments:

Post a Comment