Friday, January 10, 2014

కేజ్రీ బాకాలు..

లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించగానే, సోకాల్డ్ నేషనల్ మీడియా పప్పూ(రాహుల్ గాంధీ)ని వదిలేసింది. గజిబిజి వాలాను భుజాలకేసుకుంది.. నరేంద్ర మోడీ తర్వాత కేజ్రీనే ప్రజలు ప్రధాన మంత్రిగా కోరుకుంటున్నారట(?).. Preference for PM.. Do you think would make the best PM పేరిట నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో  నరేంద్రమోడీని 58%,  కేజ్రీవాల్ ను 25%, రాహుల్ ను 14
 %  ప్రజలు ప్రధానిగా కోరుకుంటున్నారట.. సర్వేలో 31 శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలదని కోరుకుంటున్నారట(?)
ఇక్కడే ఉంది అసలు మతలబు.. ఇటీవలి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లాపడ్డ కాంగ్రెస్ పార్టీకి 2014 పార్లమెంట్ ఎన్నికలపై భయాందోళనలు మొదలయ్యాయి.. నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా నిలువరించే సత్తా పప్పూకి లేదని తేలిపోయింది.. ఢిల్లీలో బీజేపీకి కనీస మెజారిటీ రాకపోవడంతో వారికి కేజ్రీవాల్ ఆశాకిరణంలా కనిపించాడు.. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి కేజ్రీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు..

అసలు కాంగ్రెస్ పార్టీకన్నా ఎక్కువ బాధ సోకాల్డ్ మేధావులకు, జాతీయ మీడియాకు వచ్చింది.. నరేంద్ర మోడీపై నిరంతర యుద్దం కొనసాగిస్తున్న వీరికి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఆయుధంగా దొరికాడు.. ఇంకేం భాజా భజంత్రీలు మొదలు పెట్టేశారు.. కేజ్రీవాల్ దేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన గ్రహాంతర జీవి అన్న స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం మొదలు పెట్టారు.. 

No comments:

Post a Comment