Thursday, May 31, 2012

అన్నా బృందంలో అతిగాళ్లు..

అన్నాహజారే బృందం చేస్తున్న మతిలేని ప్రకటనలు చూస్తుంటే అవినీతిపై వారు చేస్తున్న పోరాటం విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మంత్రివర్గ సహచరులు అవినీతిపరులని అన్నాహజారే బృందం తేల్చేసింది.. అయితే తన బృందం విడుదల చేసిన నివేదికను అన్నాజీయే నమ్మకలేక పోయారు.. ప్రధాని నిజాయితీ పరుడే అంటూ వివరణ ఇచ్చారు.. ఇదేమిటయ్యా అని టీమ్ అన్నాను ప్రశ్నిస్తే, హజారేజీకి ఇంగ్లీష్ రానందున తమ నివేదికను చదవలేదని ఇకిలించారు.. ప్రధాని అవినీతి పరుడని అన్నాయే నమ్మనప్పుడు దేశ ప్రజలు ఎలా నమ్మగలరు? కనీసం టీమ్ అన్నా సభ్యుల జీవిత భాగస్వాములైనా నమ్మగలరా? తాను అవినీతిపరున్నని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ప్రధానమంత్రి ప్రకటించారు.. మన్మోహన్ సింగ్ అసమమర్థ ప్రధాని అనడంలో సందేహం లేదు.. అవినీతిని అరికట్టడంలో, దేశ ఆర్థిక రంగాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.. యూపీఏ ప్రభుత్వంలో ఆయనో కీలు బొమ్మ, అసలు రిమోట్ సోనియా గాంధీ దగ్గర ఉంటుందని అందరికీ తెలుసు.. ఈ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కం ఆర్థికవేత్తకు ఉన్న క్లీన్ ఇమేజీని అడ్డంపెట్టుకొని దేశాన్ని దోచేస్తున్నవారెవరో అందరికీ తెలుసు.. చేతనైతే అన్నా బృందం వారి వెంట పడాలి.. ప్రజలు కూడా మద్దతు ఇస్తారు.. నోరులేని ప్రధానిపై చేస్తున్న విమర్శలు నవ్వును తెప్పించడంతో పాటు అన్నా బృందాన్ని చులకన చేస్తున్నాయి.. కేజ్రీవాల్, ప్రశాంత్ భూషన్, కిరణ్ బేడీల లొసుగులేమిటో అందరికీ తెలుసు.. ఈ గురవింద అతిగాళ్లను అన్నా హజారే ఎలా భరిస్తున్నారో?.. వీరిని వదిలించుకుంటే అన్నాజీ గౌరవం పదింతలవడం ఖాయమని నేను కచ్ఛితంగా చెప్పగలను..

No comments:

Post a Comment