Wednesday, May 30, 2012

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?


నిరసన తెలియజేయడానికి బంద్ నిర్వహించడాన్ని అర్థం చేసుకోవచ్చు.. కానీ రాజకీయ పార్టీల బందులు ప్రాణాలు తీయడానికి దారి తీస్తే అందుకు ఎవరు బాధ్యత వహించాలి?  రాజకీయ పార్టీలన్నీ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.. ఇటీవల జరిగిన ఒక బంద్ రోజున రంగారెడ్డి జిల్లా లోని ఇబ్రహీంపట్నం సమీపంలో కొందరు వ్యక్తులు వేగంగా వెళ్ళుతున్న బస్సుపై రాళ్లు విసిరారు. డ్రైవర్ కంటిలో అడ్డం ముక్కపడి బస్సు అదుపు తప్పి కరెంట్ పోల్ కు గుద్దుకుంది.. పాపం డ్రైవర్ మరణించాడు.. అయన కుటుంబాన్ని ఓదార్చే వారెవరు? ఈ సంఘటన జరగటానికి రెండు రోజుల ముందు వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులకు నిప్పు పెట్టారు? ఇందుకు ఒక పార్టీ వారినే తప్పు పట్టడం తగదు.. రాజకీయ పక్షాలన్నీ దోషులే.. 

No comments:

Post a Comment