Wednesday, May 9, 2012

మీడియా టార్గెటా?

రాజకీయ నాయకులు, పార్టీలు తమ లక్ష్యాలను సాధించుకోవడం కోసం సొంత మీడియాను ఎంచుకోవడం కొత్తేమీ కాదు.. గాంధీజీ, నెహ్రూలు సైతం సొంత పత్రికలు పెట్టుకున్నారు.. మన రాష్ట్రంలో కూడా అలాంటి ఉదాహరణలున్నాయి.. ప్రస్తుత సమాజంలో ఈ ధోరణి మరింత పెరిగింది.. అయితే మీడియాలో పని చేసే సిబ్బందికి (కొందరికి ఉండవచ్చేమో కానీ..) సహజంగా యజమానుల రాజకీయాలతో సంబంధం ఉండదు.. తన పత్రిక, ఛానెల్ బాగుంటేనే తన జీతం సకాలంలో వస్తుందనే ఆశాజీవులు వారు.. రాష్ట్రంలో పెద్ద పెద్ద పత్రికలు (కొన్ని ఛానెల్స్ కూడా) మూత పడి ఉద్యోగాలు లేక రోడ్డు పాలైన పాత్రికేయులెందరో ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఒక మీడియా సంస్థను బలి చేయడం కలవరాన్ని కలిగిస్తోంది.. ప్రభుత్వం, సీబీఐలకు జగన్ టార్గెట్ అయితే మరో రూపంలో చూసుకోవచ్చు.. కానీ సాక్షి పత్రిక, ఛానెల్ బ్యాంక్ అకౌంట్లను అడ్డుకోవడం ఎంత వరకూ సమంజసం.. జగన్ ఆస్తుల వ్యవహారంపై దర్యాప్తు దాదాపు అర ఏడాదికిపై కాలం నుండి నడుస్తోంది.. ఇప్పుడు అకౌంట్లను ఫ్రీజ్ చేయడం వల్ల కొత్తగా సాధించేది ఏమిటి? దర్యాప్తు పూర్తయ్యాక నేరం రుజువైతే ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం ఉన్నప్పడు ఇప్పటికిప్పుడు తొందర పడాల్సిన అవసరం ఏమిటి? ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి మీడియాతో ఢీకొని ఫలితం అనుభవించిన వారి చరిత్రలు పాలకులు ఒక్కసారి చదువుకుంటే మంచిది..

No comments:

Post a Comment