Monday, May 28, 2012

అందరూ గురవిందలే..

జగన్ అరెస్టయ్యాడని కొందరు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.. మరి కొందరు విచారిస్తున్నారు.. తమనూ అరెస్టు చేస్తారేమోనని భయపడే నాయకులూ ఉన్నారు.. వీరూ, వారూ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులున్నారు.. అందరూ దొంగలే.. గురవిందలే.. తన లోపాన్ని కప్పిపుచ్చుకొని ఎదుటివారిపై బురద చల్లేవారే.. తాను నిజాయితీ పరులమని మనస్సాక్షిగా, ఇష్ట దైవంపై ప్రమాణం చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? వీరందరినీ అరెస్టు చేస్తూ పోతే రాష్ట్రంలో జైళ్లు చాలవేమో? నీతి, నిజాయితీ ఉన్న నాయకులకు గుర్తింపు లేకుండాపోయింది.. నీతి వాక్యాలు మాట్లాడే ‘సత్తా’ పార్టీకి సైతం అవినీతి పరులకు టికెట్లిచ్చిన చరిత్ర ఉంది..ఇందుకు మన వ్యవస్థను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.. లోపం మన ప్రజల్లోనే ఉంది.. ఈ విషయంలో మరింత లోతుకు వెళ్లకపోవడమే ప్రస్తుతానికి మంచిదేమో..

No comments:

Post a Comment