Tuesday, May 29, 2012

చిచ్చు పెట్టకండి..

మత పరమైన రిజర్వేషన్లు వద్దని రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన సంచలన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చెంపపెట్టే.. జగన్ వార్తల మాయలో ఏపీ మీడియా ఈ వార్తకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకున్నా జాతీయ మీడియా మన రాష్ట్ర నాయకులతో డిబేట్లు పెట్టడం గమనార్హం.. ఇప్పటికే విద్య, వృత్తి రంగాల్లో కులపరమైన రిజర్వేషన్లు సమాజంలో ఉన్న అగాధాన్ని మరింత పెంచుతున్న క్రమంలో అసలు రిజర్వేషన్ల పైనే సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది.. బాబా సాహెబ్ ప్రతిపాదించిన రిజర్వేషన్ల స్పూర్తికి భిన్నంగా మన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో కొత్త కొత్త చిక్కులు తెస్తున్నారు.. రిజర్వేషన్ల కేటగిరిలో ఉన్న కులాలు కూడా పూర్తి స్థాయిలో లబ్ది పొందడం లేదు..క్రీమీలేయర్ అమలు చేయాలనే ప్రతిపాదన ఉన్న అమలుకు నోచదు.. రిజర్వేషన్లు పొందిన వారి వారసులే మళ్లీ మళ్లీ ఫలాలు అనుభవిస్తారు.. ప్రమోషన్లలోను  రిజర్వేషన్లు లభిస్తాయి.. ఈ విషయం అందరికి తెలుసు.. కానీ నోరు మెదపరు.. ఎవరి భయాలు వారివి.. కులంతో పాటు ఆర్థిక స్థితిని గమనించి రిజర్వేషన్లు ఇచ్చే విధానం రావాలి.. ఇప్పటికైనా సంకుచిత కుల వోటు బ్యాంకు రాజకీయాలను కట్టి పెట్టాలి.. కానీ తేనే తుట్టెను కదిపేదెవరు?

No comments:

Post a Comment