Saturday, May 26, 2012

అందరూ దొంగలే..


దొంగల్లో మూడు రకాలు ఉంటారు.. ఒకరు దొరికిన దొంగలైతే, మరొకరు దొరకని దొంగలు, మూడో రకం తేలు కుట్టిన దొంగలు.. ఇప్పడు మన రాష్ట్ర రాజకీయ నేతలు ఈ మూడు పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.. తండ్రీ కొడుకులు అధారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నారని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కోరస్ గా ఆలపిస్తున్నాయి.. ఇందుకు బాధ్యునిగా దివంగత నాయకుని కుమారున్ని కేసుల్లో ఇరికించేశారు..

సదరు కుమార రత్నం మాత్రం ఇది అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలు కలిసి తనపై పన్నిన కుట్ర అని, ప్రభుత్వంలో జరిగన వ్యవహారాలకు తానెలా బాధ్యన్నని ప్రశ్నిస్తున్నారు? అవినీతి ఆరోపనలు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతను వదిలి తన వెంటే ఎందుకు పడ్డారని అడుగుతున్నారు..

అయితే అధికారంలో ఉన్న వారేమో తమ పార్టీకి నాయకత్వం వహించిన దివంగత నాయకుని వ్యవహారాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని చేతులు దులుపుకుంటున్నారు.. పెద్దాయన చెప్పినట్లే చేశాం పరిణామాలతో మాకేమీ సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు..

ఇక తాను చేస్తే కరెక్టు, వారు చేస్తే తప్పు అనే ఆలోచనా ధోరణి ప్రధాన ప్రతిపక్ష నాయకునిది.. తన హయాంలో జరిగిన వ్యవహారాలను మాత్రం సమర్థించుకుంటూ అవతలి వారిపై బురద చల్లే పాత్రను చక్కగా పోషిస్తున్నారు..

అందరూ గొంగట్లో వెంట్రుకలు ఏరుకునేవారే.. దొరికినప్పుడే దొంగలు, అప్పటి వరకూ అందరూ దొరలే అనేది లోకోక్తి అయితే ఇక్కడ అందరూ దొంగలైనా, దొరల్లా ఫోజులు కొడుతున్నారు.. ఎవరిని నమ్మాల్లో ఎవరిని నమ్మొద్దో అర్థం కావడం లేదు.. ఈ మూడు ముక్కలాట నుండి ప్రజలకు విముక్తి లేదా?

No comments:

Post a Comment