Monday, May 21, 2012

రాజీవ్ గాంధీకి ఇచ్చే నివాళి ఇదేనా?


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్.టి.టి.ఇ. హత్య చేసి నేటికి 21 సం. అవుతోంది.. రాజీవ్ హత్య జరిగిన రోజును మన ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదుల చేతిలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను పోగొట్టుకున్నాగుణపాఠం తెచ్చుకోకపోవడం దురదృష్టకరం.. వోటు బ్యాంకు రాజకీయాలతో రాజీ పడుతున్న కాంగ్రెస్, తమిళ పార్టీలు, సంస్థలకు లొంగిపోయి రాజీవ్ హంతకులను కాపాడటం సిగ్గుచేటు.. పార్లమెంట్ పైన దాడి కుట్రదారు అఫ్జల్ గురు, ముంబై దాడుల నిందితుడు కసబ్ ను కూడా జైళ్లలో ముప్పొదుల మేపుతున్నారు.. వేరేం ఘనకార్యం చేసారని క్షమాభిక్ష ఇవ్వాలి?..  రాజీవ్ గాంధీకి ఇచ్చే నివాళి ఇదేనా? 

No comments:

Post a Comment