Thursday, May 3, 2012

ఎందుకీ రాద్దాంతం?

జగన్ తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించడాన్ని కొందరు పనిగట్టుకొని వివాదాస్పదం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. క్రైస్తవుడైన జగన్ వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్నట్లు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయంలోకి ప్రవేశించడాన్ని తప్పు పట్టలేం.. అతిథి దేవో భవ అనేది హిందూ మత సాంప్రదాయం.. అతిథులు ఎవరైనా గౌరవించి, ఆహ్వానించాల్సిందే.. స్వామిని దర్శించు కోవాలనే ఆసక్తి కారణంగానే ఆయన ఆలయానికి వచ్చారే తప్ప మన మతంపై దండయాత్రకు రాలేదు.. ఇక్కడ అపవిత్రం అనే ప్రసక్తే లేదు.. హిందూ దేశంపై దండయాత్ర చేసిన నవాబులు, బ్రిటిష్ వారు సైతం (కొందరు మూర్ఖులు తప్ప) వెంకన్నకు భక్తి కొద్ది కానుకలు సమర్పించి భక్తుల మనోభావాలను గౌరవించారు..పెడర్థాలు తీసే రాజకీయ విమర్శకులు తాము ఏమాత్రం మతాచారాలను గౌరవిస్తున్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ఇలా గగ్గోలు పెట్టేవారంతా తిరుమల కొండపై అనాచారాలు, అన్య మత ప్రచారాలు జరగకుండా తమ వంతు శ్రద్ద తీసుకుంటే బాగుంటుంది.. అయితే జగన్ ఆలయ సందర్శన సందర్భంగా కొంత అపచారం జరిగింది.. ఆలయ ఆచారాలు ఆయనకు తెలియని కారణంగానో లేదా వెంట ఉన్న పార్టీ ప్రముఖుల అత్యుత్సాహమే ఇందుకు కారణం.. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీవారి సన్నిధికి రావాలని జగన్ వెంట ఉన్న టిటిడి మాజీ ఛైర్మన్ భూమన తెలియజేస్తే బాగుండేది.. అలాగే అనవసరపు ఆర్భాటం, వేంకటేశ్వరస్వామికి బదులు జగన్కు జైకొట్టడం ముమ్మాటికీ తప్పే.. ఇది లెంపకాయలేసుకుంటే పోయే తప్పే కానీ క్షమించరానంత పెద్ద నేరమేమీకాదు..

No comments:

Post a Comment