Thursday, May 17, 2012

రూపాయి పతనం ఎవరి పాపం?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రూపాయి మారకపు విలువ అమెరికా డాలర్ కు రెండున్నర రూపాయలుగా ఉండేది.. కరెన్నీని సులభంగా మార్చుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం రూ.2.50 నోటును ముద్రించింది.. మన పాలకుల అస్థవ్యస్థ ఆర్థిక విధానాల పుణ్యమా అని రూపాయి మారకం విలువ రూ.54.49కి పెరిగింది.. సెన్సెక్స్ ఒక్కసారిగా 298 పాయింట్లకు పడిపోయి మధుపరులకు ఒక్కసారిగా రూ.77,000 కోట్ల నష్టం వాటిల్లింది.. దేశ ఆర్థిక వ్యవస్థకు గతంలో ఎన్నడూ ఇంతటి దుస్థితి కలగలేదు.. పరిస్థితులను గమనిస్తే దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లుతోందా? 1991 నాటి పరిస్థితులు రానున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఒక ప్రముఖ ఆర్థిక వేత్త ప్రధానమంత్రిగా వెలగబెడుతున్న దేశానికి ఎంత దుస్థితి.. ఇందుకు మన్మోహన్ సింగ్ సిగ్గుతో తలొంచుకోవాలి.. రాష్ట్రపతి అవుదామని కలలు కంటున్న ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నైతిక బాధ్యత వహించాలి.. దేశ ర్థిక వ్యవస్థ తగా దిగజారుతున్నా ఈ ఇద్దరు నేతలు బరి తెగించిపోవడం మన దురదృష్టకరం..

No comments:

Post a Comment