Saturday, May 26, 2012

క్రమశిక్షణ కోల్పోతున్న భాజపేయులు..

ఒకప్పడు క్రమ శిక్షణకు పేటెంట్ ఆ పార్టీ.. పూర్వాశ్రమంలో క్రమ శిక్షణ తప్పిన అధ్యక్షున్నే పార్టీ నుండి బహిష్కరించుకుంది.. కాలక్రమంలో అధికారంలోని వచ్చాక లంచం తీసుకున్నారనే అభియోగం ఎదుర్కొన్న అధ్యక్షున్ని వదిలించుకుంది.. జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా అవతరించినప్పడు తమది రాజకీయాలనే బురదలొంచి వికసించిన స్వచ్ఛమైన కమలమని గర్వంగా చెప్పున్నారు.. కానీ అధికారం అనే రుచి చూశాకా అన్ని రకాల అవలక్షణాలు పులుముకుంది.. అగ్రనేతలు సైతం క్రమశిక్షణ గాలికొదిలేసి ముఠాలు కట్టేసి పార్టీని కనుసన్నల్లో నడుపుకునే ప్రుయత్నం చేస్తున్నారు.. తాజా జాతీయ కార్యకర్గ సమావేశాలను చూస్తే.. తనకు పడని సంజయ్ జోషిని తప్పిస్తే కానీ సమావేశాలకు రాలేదు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ.. మోడీకి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి అనకబూనారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్.. అవినీతి కేసుల్లో ఇరుక్కొన్ని కోల్పోయిన పదవిని మళ్లీ ఇవ్వాలంటూ పేచీ పెడుతున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను బుజ్జగించి సమావేశాలకు పిలిచిన తీరుకు ఆగ్రహించారు అగ్రనేత అద్వానీ.. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే.. తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ పార్టీ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే అలిటమేటం ఇచ్చేశారు రాజఅవినీతి, అసమర్థ విధానాలతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న యూపీఏ ప్రభుత్వంపై పోరాడాల్సిన కమలనాథులు అంతర్గత కుమ్ములాటలతో కార్యకర్తలకు కన్నీరును, ఇతర విపక్షాలకు వినోదాన్ని, ప్రజలకు ఆగ్రహాన్ని ఏక కాలంటో పంచుతున్నారు..

No comments:

Post a Comment