Friday, May 11, 2012

ఆంగ్ల ప్రదేశ్ మనది..

ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం సబబే అంటూ ఆదర్శ పాఠశాలల్లో నియామకాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఉంది.. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం అంటూ చంకలు బాదుకునే మన నాయకులు సిగ్గుతో తలొంచుకోవాలి.. అన్ని స్థాయిల్లో తెలుగును భాషను కచ్ఛితంగా అమలు చేయడంలో విఫలమైనందుకు ముక్కు నేలకు రాసి మరీ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలి.. పొరుగు రాష్ట్రల్లో వారి మాతృ భాషను న్యాయస్థానాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిల్లో అమలు చేస్తుంటే, మన పాలకులకు మాత్రం అది అసాధ్యమైన వ్యవహారంలా అనిపిస్తుంది.. ప్రధాన అధికార కేంద్రాలైన ముఖ్యమంత్రి, శాసనసభాపతి స్థానాల్లో ఉన్న వారికే తెలుగు భాష మాట్లాడటం నామోషీ అయినప్పుడు ఈ విషయాన్ని ఇంతకన్నా ఎక్కువగా చర్చించుకోవడమే అనవసరమేమో.. పేరులోనే తెలుగు ఉండి, తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోని ప్రతిపక్ష పార్టీ అధినేత అధినేత కూడా ఈ విషయంలో కపట నిద్ర నటిస్తున్నారు.. టీడీపీతో సహా ఏ రాజకీయ పార్టీ కూడా హైకోర్టు తీర్పుపై స్పందించక పోవడం సిగ్గు.. సిగ్గు.. సిగ్గు చేటు.. తెలుగు ప్రజలకు సైతం ఈ విషయం పట్టలేదు.. అందుకే అన్నారేమో ఆంధ్రులు ఆరంభ శూరులని..

No comments:

Post a Comment