Sunday, May 13, 2012

మన పార్లమెంట్.. మన దేశం..

భారత పార్లమెంట్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఎన్నో మైలు రాళ్లను దాటేసింది.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యంగా పేరు రావడానికి పార్లమెంట్ దోహదపడింది.. అయితే ఎమర్జెన్సీ గడ్డు రోజులతో పాటు అవినీతి మన సమాజానికి మాయని మచ్చగా మారింది.. చట్ట సభలకు ఎన్నికౌతున్న ప్రతినిధులు ప్రజాసేవకన్నా సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు.. అంతమాత్రాన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిందించడం తగదు.. ప్రజల చేతిలో ఓటు హక్కు పవిత్రమైన, శక్తివంతమైన ఆయుధం.. దీన్ని మనం సక్రమంగా ఉపయోగించనందువల్లే ఈ దుస్థితి వచ్చింది.. నీతివంతులనే చట్టసభలకు ఎన్నుకుందాం.. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..

No comments:

Post a Comment