Friday, July 31, 2015

నరహంతకులను ఎందుకు క్షమించాలి?

దేశ ద్రోహులకు, హంతకులకు న్యాయ స్థానాలు విధించిన ఉరిశిక్షలను అమలు చేసేందుకు రంగం సిద్దమైనప్పుడల్లా కొందరు మేతావులు, సెలబ్రిటీలు, సోకాల్డ్ సెక్యులరిస్టులు, పబ్లిసిటీ ప్రియులు తమ ఉనికి చాటుకునేందుకు మీడియా ముందు ఆరాటపడుతుంటారు.. వారిని క్షమించి వదిలేయాలని, ఆధునిక సమాజంలో ఉరి శిక్షలు సరికావని, మానవత్వం, హక్కులు, నాగరిక విలువలు అంటూ సుద్దులు చెబుతున్నారు... మెమన్, అఫ్జల్ గురు, కసబ్ లాంటి కేసులు వచ్చినప్పుడే  వీరికి ఇవి గుర్తుకు వస్తాయి.. మిగతా సమయంలో వారి గళాలు ఎందుకు మూగ బోతాయి?.. ఉరి శిక్షపై చర్చకు ఇలాంటి సందర్భాల్లోనే వీరికి తీరిక దొరుకుతోందా?
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు విషయానికి వద్దాం.. యాకూబ్ మెమన్ తన అన్న టైగర్ మెమన్ తో కలిసి 257 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకోవడం మానవత్వమా? నాగరిక విలువలకు నిదర్శనమా? పాకిస్తాన్ తో చేతులు కలిపి దేశ ద్రోహం కాదా?.. పార్లమెంటుపై దాడికి కుట్రలో భాగస్వామి కావడం ద్వారా మన దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరిన అఫ్జల్ గురు, పాకిస్తాన్ నుండి దొంగ చాటుగా వచ్చి ముంబైలో నర మేధానికి పాల్పడ్డ అజ్మల్ కసబ్ ల విషయంలోనూ వీరి వాదన ఇలాగే ఉంది..
 

పాకిస్తాన్ మతాన్ని పావుగా వాడుకొని మన దేశంలో చిచ్చు పెడుతోంది.. వారికి తెలుసు మారణహోమం సాగిస్తే అన్ని మతాల వారు, చివరకు ముస్లింలు కూడా బాధితులవుతారని.. భారత్ ను అస్థిర పరిచే లక్ష్యంతోనే ఉగ్రవాదులు ఇలాంటి పనులకు తెగిస్తున్నారు.. మనం ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరి అవలంభించకపోతే ఏం సందేశాన్ని పంపుతున్నట్లు?.. క్షమాభిక్షలు ఇచ్చుకుంటూ కూర్చుంటే మన జైళ్లు ఇలాంటి వారికి పునరావాస కేంద్రాలుగా, రిక్రియేషన్ క్లబ్బులుగా మారతాయి.. ఇలాంటి వారిని మేపేందుకేనా ప్రభుత్వానికి పన్నులు కట్టేది?
ఉరి శిక్షను వ్యతిరేకించిన వారు ఏనాడైనా తీవ్ర వాదుల దుశ్చర్యలను ప్రశ్నించారా? అమాయక పౌరులను చంపుతుంటే అప్పుడు గుర్తుకు రాదా ఈ మానవత్వం?.. వారు హత్యలు చేస్తే శృంగారం, న్యాయ వ్యవస్థ శిక్షిస్తే వ్యభిచారంలా కనిపిస్తోందా వీరి కళ్లకు?.. బాధితుల కుటుంబాల వ్యధను కూడా చూడండి.. యాకూబ్ మెమన్ ఉరి తీయవద్దని వాదించిన వారి ద్వంద్వ వైఖరి నగ్నంగా కనిపించింది.. వారి వాదన పూర్తిగా రాజకీయ, మత కోణంలోనే కనిపిస్తోంది.. న్యాయస్థానం రాజకీయ, మతం కారణాల వల్లే శిక్ష విధించిందని రుజువు చేయగలరా?..

No comments:

Post a Comment