Monday, July 27, 2015

ఉగ్రవాదులకు శిక్ష మినహాయింపా?

తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడాలి.. కానీ కులం మతం, భాష, వర్గం, ప్రాంతాల ఆధారంగా శిక్షలు మినహాయించవచ్చా?.. 1993 నాటి ముంబై పలుళ్ల కేసు నిందితుడు యాకూబ్ మెమన్ కు ఎప్పుడో పడిన ఉరి శిక్షను అమలు చేయాలని నిర్ణయించగానే కొందరు వ్యక్తులు గగ్గోలు మొదలు పెట్టారు. ఆయన్ని క్షమించేయాలట.. ముస్లింలను మాత్రమే ఉరి తీస్తున్నారని వీరి విచిత్రమైన వాదన.. ఇందులో నిజం ఎంతో చూడండి.. నేషనల్ లా యూనివర్సిటీ నివేదిక ప్రకారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 1,342 ఉరి శిక్షలు అమలు కాగా అందులో ముస్లింలు 72 మంది మాత్రమే.. (ఈ పోస్టుతో జత చేసిన పట్టిక చూడండి.. అసలు వాస్తవాలు తెలుస్తాయి).
ఇందులో ఇంకా విచిత్రమై వాస్తవం ఏమిటంటే దేశంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 5 ఉరి శిక్షలు అమలుకాగా, వీరిలో ఒక్కరు కూడా ముస్లిలు లేరు.. కాశ్మీర్ లోయ నుండి వేర్పాటు వాదులు, మతోన్మాదులు లక్షకు పైగా పండిట్లను తరిమేశారు. వేలాది అత్యాచారాలు, లూఠీలు జరిగాయి. ఆ నిందితుల్లో ఒక్కరిపై కూడా కనీసం కేసు నమోదు కాలేదు.. పండిట్లను కదిలిస్తే ఈ ఘోర కలి గురుంచి చెబుతారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకుల విషయంలో ప్రాంతీయ పార్టీలు అవలంభిస్తున్న వైఖరి ఎంత ప్రమాదకమో ఆలోచించండి.. మన దేశ సమగ్రతకు సవాలు విసిరిన శక్తులతో కలిసి, దేశ నాయకత్వాన్ని హత్య చేసిన వారిని క్షమించడం ద్వారా ఏ సందేశం పంపుతున్నట్లు?.. పార్లమెంట్ పై దాడి చేసి కేసులలో నిందితుడు అఫ్జల్ గురు, ముంబై మారణకాండలో పాల్గొన్న పాకిస్తాన్ పౌరుడు అజ్మల్ కసబ్ లకు ఉరి శిక్ష పడినా రాష్ట్రపతి క్షమాభిక్ష సాకుతో నెలల తరబడి జైళ్లలో సజీవంగా ఉంచి ప్రజాధనంతో మేపారు.. చివరకు ఎన్నికల ముందు ప్రజాగ్రహానికి జడిసి ఉరి తీశారు..
ఇక 1993 ముంబై పేలుళ్ల  విషయానికి వస్తే.. ఆనాడు జరిగిన 13 వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు. అంతటి ఘోర ఘటనకు కారకుల్లో ఒకడైన మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలనడంలో వాదనలో న్యాయం ఉందా?

నేరస్తులు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాషీయుడైనా, ఏ వర్గీయుడైనా, ఏ ప్రాంతీయుడైనా కఠినంగా శిక్షించాల్సిందే..

No comments:

Post a Comment