Tuesday, July 14, 2015

విగ్రహం కృష్ణునిదా? రామారావుదా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తజనకోటి విశ్వాసాలతో ఎలా ఆడుకుందో చూడండి..  పవిత్ర పుష్కరాల సాక్షిగా గోదావరి నది ఒడ్డున అపచారానికి ఒడిగట్టింది.. అక్కడ ప్రతిష్టించించింది రామారావు విగ్రహమా?, శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహమా?.. కాదు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీరామారావు విగ్రహం.. ఈ తరహా విగ్రహ ఏర్పాటు ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సందేశం ఏమిటి?.. వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది..
ఎన్టీఆర్ తెలుగు వెండి తెరపై ధృవతార.. తెలుగువారంతా పార్టీలకు అతీతంగా అభిమానిస్తారు.. పలు పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుని పాత్రను పోషించారు.. అంత మాత్రాన ఏకంగా కృష్ణుని రూపంలో రామారావు విగ్రహాన్ని పెట్టడం ఎందుకు?.. ఎన్టీరామారావు విగ్రహమో, శ్రీకృష్ణుని విగ్రహమో.. ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.. కానీ రెండింటినీ కలగలపడం ద్వారానే అసలు సమస్య ఏర్పడింది..
గతంలో ఎన్నికల సందర్భంగా టీడీపీ వారు శ్రీకృష్ణుని పాత్రతో ఉన్న ఎన్టీరామారావు కటౌట్లను ఏర్పాటు చేస్తే, ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఫలితంగా వాటిని తొలగించుకోవాల్సి వచ్చింది.. దీని వెనుక అభ్యంతరాన్ని ఆ పార్టీ వారు గ్రహించే ఉండాలి..
తెలుగు దేశం వారికి ఎన్టీరామారావుపై ఉన్న అభిమానాన్ని ప్రకటించుకోవడానికి ఇతర మార్గాలు లేవా? వారు తమ పార్టీ కార్యాలయాలు, నివాసాల ఆవరణలో నిరభ్యతరంగా ఈ తరహా విగ్రహాలను ప్రతిష్టించుకోవచ్చు.. ఎవరికీ అభ్యంతరం ఉండదు.. కానీ బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్టించడంతోనే అభ్యంతరం ఏర్పడింది..

శ్రీకృష్ణుని పాత్రలో ఉన్న ఎన్టీరామారావు విగ్రహం ఏర్పాటుపై సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నవారిపై టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు దాడులు చేస్తున్నారు.. అది వారికి ఉన్న స్వేచ్ఛగానే భావిద్దాం.. కానీ నిజం నిష్టూరంగా ఉంటుంది.. యదార్థవాది లోక విరోధి అంటారు అందుకే.. దాడులతో వాస్తావాన్ని కప్పి పుచ్చడం సాధ్యం కాదు.. 

No comments:

Post a Comment