Sunday, July 19, 2015

పుష్కరాలు తప్పా?

తప్పంతా పీఠాధిపతులు, స్వాములు, ప్రవచనకారులదే.. భక్తి ఉద్యమం ద్వారా మహా పాపం చేస్తున్నారు.. శాస్త్రాలు, పురాణాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. విశ్వాసం పేరిట ప్రజలను మాయలో పడేస్తున్నారు.. భక్తి పేరిట అవివేకులుగా మారుస్తున్నారు.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం పేరిట గోదావరిని మురికిగా మారుస్తున్నారు.. రాజమండ్రిలో 27 మంది చావుకు బాధ్యత వీరిదే..
ఎలా ఉంది వితండ వాదం?.. సనాతన ధర్మాన్ని, విశ్వాసాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడుకోవాలనే శ్రద్ధాసక్తులు ప్రజల్లో పెరగడాన్ని జీర్ణించుకోలేని శక్తులు కొత్తగా ఈ తరహా దుష్ప్రచారాన్ని మొదలు పెట్టాయి.. అన్య మతస్తులు తమ విశ్వాసాలను ప్రచారం చేసుకోవడానికి ఎంతకైనా బరితెగించుకోవచ్చు.. కానీ వీరు చేస్తున్నది మాత్రం ఘోరమైన తప్పు.. ఇదేగా మీరు చెప్పదలచుకున్నది..
పుష్కరాలు కొత్తగా పుట్టుకొచ్చాయా? వీటిని కనిపెట్టింది ఈ పీఠాధిపతులు, స్వాములు, ప్రవచనకారులేనా?.. పుష్కర విధులను భక్తులకు గుర్తు చేసి, పుణ్యస్నానాలు, తర్పణలు చేయమని బోధించడమే వీరు చేసిన మహాపాపమా?..

రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనకు ఎవరు బాధ్యులు? ఎవరి తప్పిదం కారణంగా భక్తులు అన్యాయంగా మరణించారు?.. ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించరు?.. అసలు వాస్తవాన్ని గాలికి వదిలి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంత దుష్ప్రచారం అవసరమా?.. 

No comments:

Post a Comment