Sunday, July 26, 2015

కార్గిల్ విజయ స్పూర్తిని మరచిపోకండి..

కార్గిల్ యుద్ధం పేరు వినగానే నా మనసు భావోద్వేగంతో నిండిపోతుంది.. 1999లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కార్గిల్ సెక్టార్లోకి పాకిస్తాన్ సైన్యం చొచ్చుకు వచ్చింది.. ఈ చొరబాట్లను తిప్పి కొట్టేందుకు భారత సైన్యం ఎత్తైన పర్వత శిఖరాల్లో సాగిన యుద్ధం మూడు నెలల పాటు కొనసాగింది.. జులై 26న టైగర్ హిల్స్ పై మన జవానులు విజయకేతం ఎగురేయడంతో యుద్ధం ముగిసింది. ఆనాటి యుద్ధంలో 527 మంది జవాన్లు దేశ సరిహద్దులను రక్షించేందుకు ప్రాణ త్యాగం చేశారు..
కార్గిల్ అమర వీరుడు మేజర్ పద్మపాణి ఆచార్య మా హస్తినాపురం కాలనీ వాసి అని చెప్పుకునేందుకు నేనెంతో గర్వపడుతుంటాను... ఆయన పార్థివ దేహం మా కాలనీకి చేరినప్పుడు వేలాది మంది నివాళ్లర్పించేందుకు తరలి వచ్చారు.. ఆనాటి భావోద్వేగ దృశ్యాలు నేటికీ నా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఎక్కడ చూసినా భారత్ మాతాకీ జై.. మేజర్ పద్మపాణి ఆచార్య అమర్ హై.. పాకిస్తాన్ ఖబర్దార్.. మార్ దాలో __కో, పాకిస్తాన్ కుత్తోంకో ’ అనే నినాదాలు.. మేమంతా కలసి పాకిస్తాన్ పతాకాన్ని కాల్చేసి కసి తీర్చుకున్నాం..
16 ఏళ్ల తర్వాత పరిస్థితి గమనిస్తే దేశ ప్రజలే కాదు, మా కాలనీ వాసులు సైతం కార్గిల్ విజయాన్ని మరచిపోయినట్లున్నారు.. కొత్త తరానికి ఆనాటి భావోద్వేగాలు, స్పూర్తిని గుర్తు చేసినా వారికి అంతగా పట్టనట్లు అనిపిస్తోంది.. ఈ పరిణామం కాస్త బాధ కలిగించేదే..

దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నప్పుడే మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తాం.. సరిహద్దుల్ని నిరంతరం కాపాడుతున్న వీర జవాన్లకు మనం ఎప్పటికీ రుణపడే ఉంటాం.. వారిది సాదాసీదా ఉద్యోగం కాదు, త్యాగాలతో కూడిన బాధ్యత గుర్తించాలి.. కార్గిల్ యుద్ద విజయం సాధించి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లను స్మరించుకుందాం..

No comments:

Post a Comment