Monday, July 20, 2015

రైతును గాలికొదిలిన తెలుగు రాష్ట్రాలు

2014లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1979 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇందులో తెలంగాణలో 1347 మంది, ఆంధ్రప్రదేశ్లో 632 మంది రైతులున్నారు.. జాతీయ నేర నమోదు సంస్థ వెల్లడించిన నివేదిక ఇది.. రైతుల ఆత్మహత్యల్లో దేశ వ్యాప్తంగా 31.3 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే నమోదు కాగా తెలంగాణ రెండో స్థానంలో, ఏపీ ఏడో స్థానంలో ఉంది.. ఇక దినసరి కూలీల విషయానికి వస్తే తెలంగాణలో 1242, ఏపీలో 1033 మంది ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ నివేదిక కాస్త ఆలస్యంగా వచ్చినా పట్టించుకోకుండా వదిలించుకోలేం..
ఉభయ తెలుగు రాష్ట్రాలు పాలన, రాజకీయ పరమైన గిల్లి కజ్జాలతో రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేసిన ఫలితమిది.. అన్నదాత మృత్యుఘోష తెలంగాణ, ఏపీ పాలకులకు పట్టలేదు.. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కాబట్టి బాలారిష్టాలు సహజం అని సరిపెట్టుకోవడంలో అర్థం లేదు.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటూ రైతులను భ్రమల్లో ముంచెత్తారు.. కానీ అధికారంలోకి రాగానే ముందుగా రుణమాఫీ విషయంలో దోబూచులాడారు.. అక్కడే రైతులు అర్థం చేసుకున్నారు తాము మళ్లీ మోసపోయామని..

రైతులకు ఏమి చేయబోతున్నారన్నది తర్వాత విషయం.. ముందు వారిలో భరోసా కల్పించి ఉంటే 1979 ప్రాణాల్లో కొన్నైనా మిగిలేవి కదా..

No comments:

Post a Comment