Friday, July 10, 2015

చెత్త శుద్దిలో చిత్త శుద్ధి ఎంత?

స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్.. నినాదం ఏదైనా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే స్ఫూర్తి దీని వెనుక ఉంది..  కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాలు చేరి భాగస్వాములయ్యాయి. చీపుళ్లు పట్టి వీధులు, పార్కుల్లోని చెత్తను, మట్టిని ఊడ్చి కుండీల్లో వేస్తున్నాం.. అంత వరకూ ఓకే.. ఆ తర్వాత ఏం జరుగుతోంది..
ఈ చెత్తనంతా తరలిండం పారిశుధ్య కార్మికుల పని.. ఎంత ఊడ్చి చెత్త పోగేసినా దాన్ని తీసుకెళ్లేది మాత్రం వీరే.. మనం ఎంత స్వచ్ఛతను పాటించినా ఈ పని జరగకపోతే చేసిందతా నిష్ప్రయోజనమే.. ఇప్పుడు జరుగుతున్నది అదే..
చాలా కాలంగా అపరిశ్కృతంగా ఉన్న తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగారు.. సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇరువురూ రాజీ పడటంలేదు.. కార్మికుల డిమాండ్లలో చాలా వరకూ న్యాయమే కనిపిస్తోంది.. కానీ వాటికి ఒప్పుకుంటే ఆర్థిక భారం పెరిగిపోతుందని  ప్రభుత్వ వాదన..
ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో హైదరాబాద్ మహా నగరంలో కొద్ది రోజులుగా వీధుల్లో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది.. కంపు భరించపోతున్నాం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజధాని నగరం రోగగ్రస్థం కావడం ఖాయం..

స్వచ్ఛ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడమే కాదు, దీనితో ముడిపడి ఉన్న ఇతర అంశాలను ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి.. ఈ చిత్తశుద్ధి లేకపోతే స్వచ్ఛ కార్యక్రమాన్నీ శుద్ధ దండగే అవుతాయి..

No comments:

Post a Comment