Friday, July 17, 2015

పిచ్చివారు ఇలా మొరుగుతూనే ఉంటారు..

ఈ దేశంలో హిందుత్వం ఉండరాదు.. వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి.. గోదావరి పుష్కరాలకు ఒక్కరు కూడా పోకుండా అడ్డుకోవాలి.. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడాలి.. ఈ బాధ్యత క్రైస్తవులు, దళితులు తీసుకోవాలట..  ఇదీ ఓ పిచ్చి పుల్లయ్య వాదన.. నేను హిందువునెట్లయిత? అంటాడు.. హిందూమతంపై విషయం కక్కుతుంటాడు.. ఈయన హిందువే కానప్పుడు, హిందువులపై విద్వేషాన్ని ప్రకటించడం పరమత అసహనం కాదా?.. క్రైస్తవులను హిందువులపై రెచ్చగొట్టడంలో అర్థం ఏమిటి? కుల, మత ఘర్షణలలతో కొట్టుకు చావాలని ఆశిస్తున్నాడా?..

ఆయన ఏ మతస్తుడో తెలియదు.. కానీ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా హిందూ మతంపై నిప్పులు కక్కుతుంటారు.. ఆయన నాలిక ఎటంటే అటు పోతుంది.. టీవీ చర్చల్లో ఎవరైనా పాయింట్ టూ పాయింట్ నిలదీస్తే చర్చను పక్కవోవ పట్టిస్తాడు.. ఇలాంటి వారిని పట్టించుకోకపోవడమే మంచిది.. మతి స్థిమితం లేని వారిని కదిలిస్తే బురదలో రాయి వేయడమే అవుతుంది.. మీడియా ప్రచారం దొరికినతం కాలం పిచ్చివాగుడు వాగుతూనే ఉంటాడు. ఆయన పేరు ప్రస్థావించడం నాకు ఇష్టం లేకున్నా మీరు గ్రహించే ఉంటారు..

1 comment:

  1. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందని సామెత.

    ReplyDelete