Friday, July 24, 2015

బ్రిటన్ తన దోపిడీకి మూల్యం చెల్లిస్తుందా?

బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం, అభివృద్ధి అంతా భారత దేశంలో వారు లూఠీ చేసిన సొమ్ము ద్వారానే సాధ్యమైంది.. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఆక్స్ ఫర్డ్ యూనియన్ లో సమావేశంలో చేసిన వ్యాఖ్యాలివి.. వలస పాలన ద్వారా భారత్ ను కొల్లగొట్టిన ఆ దేశం నష్ట పరిహారం చెల్లించుకోవాలి అని ఆయన చేసిన డిమాండ్ కు ఆ సభలోని బ్రిటన్ పౌరులు కూడా చప్పట్లు కొట్టారు..
పదేళ్ల క్రితం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ లండన్ పర్యటించిన సమయంలో భారత దేశంలో బ్రిటన్ పాలను తెగ పొడిగారు.. తెల్లోళ్లు పాలించడం బట్టే భారత్ అభివృద్ధి చెందిందంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. ఎంతలో ఎంత తేడా..
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దాదాబాయి నౌరోజీ పార్లమెంట్ సభ్యుడి హోదాలో వందేళ్ల క్రితమే బ్రిటన్ పార్లమెంట్ లో వారి దోపిడి పలనను ఎండగట్టారు. భారత్ ను కొల్లగొట్టి బ్రిటన్ ను వలస పాలకులు అభివృద్ది చేసుకుంటున్న తీరును నౌరోజీ డ్రెయిన్ థియరీ రూపంలో చెప్పారు..
శశిథరూర్ ప్రసంగం యూట్యూబ్ ద్వారా సంచనలం సృష్టించడమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకోవడం అందుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపొతోంది.. ఫలితంగా పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించడం సమంజసం కాదని థరూర్ చేసిన సూచనను సాకుగా చూపుతూ ఆయన్ని అధికార ప్రతినిధి పదవి నుండి తొలగించింది..

No comments:

Post a Comment