Wednesday, April 8, 2015

పాపం చందన కూలీలు

ఎందుకు చంపారు?..
ఎదురు తిరిగారు కాబట్టి చంపాం..
వారు ఎర్రచందన స్మగ్లర్లేనా?..
కొందరు కూలీలు.. కొందరు స్మగ్లర్లు కావచ్చు..
ఇదండీ శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కథ.. ఎవరు దొంగలు, ఎవరు స్మగ్లర్లు, ఎవరు కూలీలో తెలియదు.. కానీ ఒక్కటి మాత్రం చెప్పవచ్చు పొట్టకూటి కోసం ఎర్రచందనం నరికేందుకు తమిళనాడు నుండి వచ్చిన అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయారు.. వారిని అక్కడికి పంపినవారు సేఫ్.. విలువైన అటవీ సంపదను కాపాడుకోవడంలో తప్పులేదు.. కానీ కాస్త విచక్షణ కూడా అవసరం.. ఎర్రచందన వ్యవహారం నడిపిస్తున్నవారు ఎవరు?.. ఈ స్మగ్లర్లకు రాజకీయ అండదండలు లేకుండానే ఇంతగా బరి తెగించారా? వారంతా భద్రంగా ఉన్నారు.. కూలీలు మాత్రం చచ్చారు..

విచక్షణ లేని పోలీసుల బుర్రల కారణంగా తమిళనాడుతో వివాదం తెచ్చుకోవాల్సి వచ్చింది.. అక్కడి తలతిక్క నాయకులు ఏకంగా తెలుగువారిని టార్గెట్ చేసేందుకు ఉసిగొల్పుతున్నారు.. శేషాచలం ఎన్ కౌంటర్ వెనుక నిజానిజాలు తేలాలి.. 

No comments:

Post a Comment